Site icon NTV Telugu

INDIA Bloc Protest: పార్లమెంటులో భద్రతా లోపం.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆగ్రహం

Rahul

Rahul

Rahul Gandhi: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసినా ఎంపీల సస్పెన్షన్‌పై పోరు కొనసాగుతోంది. మరోవైపు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష భారత కూటమి నిరసనలు తెలుపుతోంది. రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ప్రతిపక్ష పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు దేశంలో వాక్ స్వాతంత్య్రం అంతమైందని, యువత నిరుద్యోగులుగా మారుతున్నారని అన్నారు. ఆరు రోజుల క్రితం కొంత మంది యువకులు పార్లమెంట్‌లోకి ప్రవేశించి పొగను విడుదల చేశారు.. దీంతో బీజేపీ ఎంపీలంతా పారిపోయి ఊపిరి పీల్చుకున్నారు అని రాహుల్ గాంధీ చమత్కరించారు.

Read Also: Salaar Dinosar: మిస్సింగ్ డైనోసర్… ఆ ఒక్కటీ మిస్ అయ్యిందే

పార్లమెంట్‌లో భద్రతా లోపాన్ని లేవనెత్తిన రాహుల్ గాంధీ.. భద్రతా లోపంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే సమాధానం చెప్పాని ఆయన డిమాండ్ చేశారు. ఆ యువత ఎందుకు ఈ నిరసన చేశారని కూడా ప్రశ్నించారు..? దీనికి కారణం నిరుద్యోగమేనంటూ ఆయన విమర్శించారు. దేశంలో తీవ్ర స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయింది.. నేటి యువతకు ఉపాధి దొరకడం లేదని అన్నారు. దేశంలో ఏ నగరానికి వెళ్లిన.. భారతదేశంలోని యువత మొబైల్ ఫోన్‌లలో రోజుకు ఎన్ని గంటలు గడుపుతుందో తెలుసుకోండి అని ఆయన చెప్పారు. ప్రతి చిన్న గ్రామంలో కూడా యువత రోజుకు ఏడున్నర గంటలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, మెయిల్‌, సెల్‌ఫోన్‌లలోనే గడుపుతున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వ హయాంలో భారతదేశంలోని యువత ఏడున్నర గంటలు ఫోన్‌లోనే ఉన్నారు.. ఎందుకంటే మోడీ జీ వారికి ఉపాధి కల్పించలేదు.. యువతకు ఉపాధి లభించకపోవడం వల్లే పార్లమెంట్‌లో శాంతి భద్రతలకు విఘాతం కల్పించారని రాహుల్ గాంధీ వెల్లడించారు.

Exit mobile version