INDIA: ఇండియా కూటమి సంచలన నిర్ణయం.. వారిపై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA Alliance Decided to Boycott Some Anchors and Media Shows: నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య నిస్పక్షపాతంగా ఉండాల్సిన మీడియా సంస్థలు కొన్ని ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటిలో కొన్ని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నాయి. అయితే తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసే టీవీ ఛానెళ్లు, యాంకర్లు, టీవీ షోలను బహిష్కరించాలని నిర్ణయించింది ఇండియా సమన్వయ కమిటీ. బాయ్కాట్ చేయబోయే యాంకర్లు, షోల జాబితాను విపక్ష నేతలు రెడీ చేయనున్నారు.మీడియాపై ఏర్పాటు చేసిన సబ్గ్రూప్ కమిటీ యాంకర్లు, షోల పేర్లను రూపొందిస్తుందని కోఆర్డినేషన్ కమిటీ తెలిపింది.
Also Read: Rana Daggubati: ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాకి రానా గ్రీన్ సిగ్నల్?
Also Read
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
ఢిల్లీలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో నిన్న జరిగిన ఇండియా కోఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రధానంగా మీడియాలోని ఒక వర్గం తమపై పదే పదే విష ప్రచారం చేస్తోందని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ఎంతో ఆధారణ లభిస్తున్నా మీడియాలోని ఒక వర్గం తక్కువ కవరేజీ ఇస్తోందని కాంగ్రెస్ చెబుతోంది. సోషల్ మీడియా నుంచి సైతం జోడో యాత్రకు భారీగా మద్దతు లభించిందని చెబుతున్న కాంగ్రెస్ కానీ పలు ప్రధాన మీడియా సంస్థలు కావాలనే జోడో యాత్రను బహిష్కరించాయని ఆరోపిస్తోంది.
ఇదే విషయాన్ని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ కూడా నొక్కి చెప్పారు. బీజేపీకి వత్తాసు పలుకుతూ రాహుల్ గాంధీ జోడో యాత్ర గురించి ఆ ఛానళ్లు ప్రసారం చేయడం లేదని ఆయన అన్నారు. ఈ కారణంగానే ఒక నెల పాటు టీవీ చర్చలకు తమ అధికార ప్రతినిధులను పంపకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. అన్ని మీడియా ఛానెల్లు తమ షోలలో కాంగ్రెస్ ప్రతినిధులను ఉంచవద్దని అభ్యర్థిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్లో(ఎక్స్) ఓ ట్వీట్ పెట్టారు. ఇక గతంలో అనగా 2019లో కూడా ఒక నెల పాటు టెలివిజన్ షోలను నిషేధించింది కాంగ్రెస్. ఇక నిన్న జరిగిన సమావేశంలో ప్రధానంగా టికెట్ల పంపకం, ఎన్నికల్లో గెలవడానికి ప్రధానంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించారు.
- Tags
- boycott
- INDIA Alliance
- Media
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!