Site icon NTV Telugu

IND vs ENG: తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 358 ఆలౌట్‌.. గాయంతోనే హాఫ్ సెంచరీ చేసిన రిషబ్‌ పంత్‌

Rishab

Rishab

భారత్- ఇంగ్లాండ్ మధ్య ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో నాల్గవ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ గ్రౌండ్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో, భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 44 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లు కోల్పోయింది. రెండో సెషన్‌లోనే భారత్ కుప్పకూలింది. భారత్ తరపున రిషబ్ పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో గాయంతోనే అర్ధ సెంచరీ (54 పరుగులు) సాధించాడు. సాయి సుదర్శన్‌-61, జైశ్వాల్-58 పరుగులతో రాణించారు. ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు పడగొట్టాడు.

Also Read:RSS: ముస్లిం, హిందువుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ యత్నం..!

మాంచెస్టర్ టెస్ట్ తొలి రోజు, మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 19 పరుగులు చేసి నాటౌట్‌గా తిరిగి వచ్చాడు. శార్దూల్ ఠాకూర్ 19 పరుగులు చేసి నాటౌట్‌గా తిరిగి వచ్చాడు. జైస్వాల్, సాయి సుదర్శన్ అర్ధ సెంచరీలు సాధించారు. రిషబ్ పంత్ 37 పరుగులు చేసిన తర్వాత రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అతని కాలికి గాయం అయింది. కెఎల్ రాహుల్ 46 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ బ్యాట్ ఝుళిపించలేకపోయాడు.

Also Read:Jio: డేటా ఎక్కువగా యూజ్ చేస్తారా? మీ కోసమే ఈ ప్లాన్.. నెలకు రూ. 276 మాత్రమే.. డైలీ 2.5జీబీ, అన్ లిమిటెడ్ కాల్స్

ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని టీమ్ ఇండియాకు ఈ మ్యాచ్ ‘డూ ఆర్ డై’ లాంటిది. ఈ టెస్ట్‌లో భారత జట్టు ఓడిపోతే, ఇంగ్లాండ్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.

Exit mobile version