Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News India Ai Impact Summit Delhi Chaos Rajeev Chandrasekhar Ashwini Vaishnaw Apology Arrangements Criticism

India AI Impact Summit 2026: న్యూఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో గందరగోళం.. వివాదంపై బీజేపీ రియాక్షన్..

Published Date :February 18, 2026 , 4:22 pm
By RAMAKRISHNA KENCHE
India AI Impact Summit 2026: న్యూఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో గందరగోళం.. వివాదంపై బీజేపీ రియాక్షన్..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

India AI Impact Summit 2026: న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ తొలి రోజే భారీ గందరగోళానికి గురైంది. ఇది యువతలో ఉన్న అపార ఆసక్తి వల్లే జరిగిందని కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఈ సమ్మిట్ ప్రధాని నరేంద్ర మోడీ టెక్నాలజీ విజన్‌లో కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమ్మిట్ మొదటి రోజు భారీ క్యూలు, ప్రవేశ విధానంపై స్పష్టత లేకపోవడం, హాల్‌లలో గందరగోళం వంటి సమస్యలు ఎదురైనా.. నిర్వహణ బృందం ఇప్పటికే క్షమాపణ చెప్పిందని గుర్తుచేశారు. కానీ ఇంత పెద్ద సంఖ్యలో యువత ఏఐ భవిష్యత్తులో భాగస్వాములు కావాలనే ఉత్సాహంతో రావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. చిన్న చిన్న నిర్వహణ లోపాలు ఉన్నా, ఈ కార్యక్రమాన్ని పెద్ద దృక్కోణంలో చూడాలని సూచించారు.

READ MORE: Ishan kishan: ICC ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ దూకుడు.. టాప్-10లో స్థానం..

Also Read

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
  • Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
  • PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..
Add as a preferred
source on google

భారత్ డిజిటల్ ప్రయాణాన్ని కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. టెక్నాలజీ అనేది కేవలం ల్యాబ్‌లకే పరిమితం కాదని, పాలన, ప్రజాస్వామ్యం, ఆర్థికాభివృద్ధి, ప్రజల జీవితాల్లో నమ్మకం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారతదేశం 1.4 బిలియన్ ప్రజలకు టెక్నాలజీ ద్వారా మార్పు తీసుకువచ్చిన దేశంగా ప్రపంచానికి చూపించిందని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో జరిగే సమ్మిట్‌లతో పోలిస్తే ఈ కార్యక్రమానికి మూడు లక్షల మందికిపైగా హాజరు కావడం భారత డిజిటల్ భవిష్యత్తుపై ప్రజల ఆసక్తిని చూపుతోందన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొనేవారికి ఎదురైన ఇబ్బందులపై క్షమాపణ చెప్పారు. అందరి ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరిస్తున్నామని, సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక వార్‌రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నామని చెప్పారు.

READ MORE: T20 World Cup 2026: శ్రీలంక, జింబాబ్వే చేతిలో పరాజయం.. ఆస్ట్రేలియా పతనానికి అసలు కారణాలు ఇవే?

అయితే మరోవైపు ఈ కార్యక్రమంపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ప్రవేశానికి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం, క్యూ ఆర్ కోడ్‌లు, పాస్‌ల విషయంలో గందరగోళం, మీడియాకు సరైన సదుపాయాలు లేకపోవడం వంటి అంశాలు ప్రతినిధులు ప్రస్తావించారు. హాల్‌లలో సరిపడా సీట్లు లేకపోవడం, దారిచూపే బోర్డులు లేకపోవడం అసంతృప్తికి కారణమయ్యాయి. మైత్రేయ వాఘ్ అనే స్టార్టప్ వ్యవస్థాపకుడు గేట్లు మూసివేయడంతో తన స్టాల్‌కే వెళ్లలేకపోయానని సోషల్ మీడియాలో వాపోయాడు. మరో స్టార్టప్ అధినేత ధనంజయ్ యాదవ్ భద్రతా కారణాల పేరుతో బయటకు పంపించారని, తరువాత తమ పరికరాలు కనిపించలేదని ఆరోపించాడు. భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్న చోట ఇలా ఎలా జరిగిందని ప్రశ్నించాడు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కూడా ఈ కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. బయటకు మెరిసేలా కనిపించినా లోపల సరైన ప్రణాళిక లేదని, ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు.

India under PM @narendramodi ji has demonstrated to the world how tech and innovation can be harnessed for the benefit of 1.4 billion India via #IndiaDPI.

Tech is not just abt research, innovation as far as India is concerned. Tech has driven and drives real transformation in… pic.twitter.com/gs4eApZ8Na

— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) February 18, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AI event mismanagement India
  • AI summit news
  • Ashwini Vaishnaw apology
  • India AI Impact Summit 2026
  • India digital transformation

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions