IND vs SL: ఓటమి నుండి టీమిండియా కోలుకుంటుందా.? ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయంటే..
- చివరి వన్డే ఆగస్టు 7న కొలంబోలో.
- సిరీస్ లో శ్రీలంక 1 - 0 తో ముందంజ.
- శివమ్ దూబే స్థానంలో రియాన్ పరాగ్కు అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL 3 ODI : టీమిండియా, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య మూడవ, చివరి వన్డే ఆగస్టు 7న కొలంబోలో జరగనుంది. ఇకపోతే రెండో వన్డేలో టీమిండియా పై శ్రీలంక 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆతిథ్య జట్టుకు సిరీస్ గెలిచే గొప్ప అవకాశం వచ్చింది. మరోవైపు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు సిరీస్ను డ్రాగా ముగించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య జరిగిన పోరులో భారత జట్టుదే పైచేయి. ఇప్పటి వరకు ఇరు జట్లు మొత్తం 170 వన్డేల్లో తలపడగా.. అందులో భారత్ 99 మ్యాచ్లు, శ్రీలంక 58 మ్యాచ్లు గెలిచాయి. కాగా 2 మ్యాచ్లు టై కాగా, 11 మ్యాచ్లు ఎటువంటి ఫలితాన్ని పొందలేదు. శ్రీలంక గడ్డపై భారత్ 5 సిరీస్లు గెలుచుకోగా, 2 సిరీస్ లను ఓడిపోయింది.
ఇకపోతే ప్రస్తుత సిరీస్లో తొలి రెండు వన్డేల్లో కెప్టెన్ రోహిత్ శర్మ మినహించి మిగితా భారత బ్యాట్స్మెన్లు నిరాశపరిచారు. రెండో వన్డేలో లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు కేవలం 208 పరుగులకే కుప్పకూలింది. ఇకపోతే చివరి వన్డేలో శివమ్ దూబే స్థానంలో రియాన్ పరాగ్కు అవకాశం లభించకపోలేదు. ఇక ప్రాబబుల్ XI లో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ లు ఉండవచ్చు.
Also Read
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
ఇకపోతే శ్రీలంక బౌలర్లు ఇప్పటి వరకు అద్భుతాలు చేశారు. రెండో వన్డేలో శ్రీలంక స్పిన్నర్లు ఏకంగా 9 వికెట్లు తీశారు. కొలంబో స్పిన్కు అనుకూలమైన పిచ్పై జెఫ్రీ వాండర్ మరోసారి భారత బ్యాట్స్మెన్కు సమస్యలు సృష్టించాలనుకుంటున్నాడు. రెండో వన్డేలో వాండర్సే 6 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో మరోసారి ఇబ్బందులు సృష్టించాలనుకుంటున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ 2 వన్డేల్లో 61.00 సగటుతో మొత్తం 122 పరుగులు చేశాడు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ అర్ధ సెంచరీలు సాధించాడు. ఇక శ్రీలంకలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వెలలాగే మంచి ప్రదర్శన చేశాడు. అతను 2 ఇన్నింగ్స్లలో 106.00 స్ట్రైక్ రేట్తో 106 పరుగులు చేశాడు. ఆగస్టు 7న ప్రేమదాస ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంక, భారత్ మధ్య మూడో ODI మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీ లైవ్ యాప్లో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటల నుండి ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
తాజావార్తలు
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
-
Maruti WagonR Flex Fuel: దేశపు తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు మారుతి వాగన్ఆర్ ఆవిష్కరణ.. పెట్రోల్ ఖర్చు, కాలుష్యానికి చెక్!
-
AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!