IND vs AUS Final 2023: భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS Final Weather Forecast and Pitch Report: భారత గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈరోజు మధ్యాహ్నం ఫైనల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. వాతావరణం సహకరిస్తుందా? లేదా? అనే అనుమానం అభిమానుల మనసులను తొలిచేస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఓ క్లారిటీ ఇచ్చింది.
భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్కు ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని, 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. అయితే 17 నుంచి 19 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు చెప్పింది. దాంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్కు సోమవారం రిజర్వ్ డే ఉన్న విషయం తెలిసిందే.
Also Read
నరేంద్ర మోడీ స్టేడియం సాధారణ బ్యాటింగ్ పిచ్. పూర్తిగా బ్యాటింగ్కు గానీ, బౌలింగ్కు కానీ ఏకపక్షంగా ఈ పిచ్ సహకరించదు. బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకుంటే పరుగులు చేయొచ్చు. బౌలర్లూ ప్రభావం చూపించేందుకు అవకాశం ఉంది. లీగ్ దశలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఇదే పిచ్పై జరిగింది. ఆ మ్యాచులో 191 పరుగులకే పాకిస్థాన్ను చిత్తు చేసి 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ స్పిన్ పాకిస్థాన్ను చిత్తు చేసింది.
Also Read: IND vs AUS Final 2023: నేడు వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మూడో టైటిల్పై భారత్ గురి!
ఫైనల్ ఆడే పిచ్ నెమ్మదిగా ఉంటుందని అంచనా. ఈ పరిస్థితిలో భారత స్పిన్నర్లు ఆస్ట్రేలియాను ఇబ్బంది పెట్టనున్నారు. శుక్ర, శని వారాల్లో ఈ నల్లమట్టి పిచ్పై హెవీ రోలర్లను ఉపయోగించారు. దాంతో ఈ పిచ్ స్లోగా ఉంటుందనే దానికి స్పష్టమైన సూచన. ఈ పిచ్ స్లోగా ఉంటుందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మ్యాచ్కు ముందు మీడియా సమావేశంలో తెలిపాడు. అయితే పాకిస్థాన్ మ్యాచుతో పోలిస్తే ప్రస్తుతం పిచ్పై పచ్చగడ్డి కనిపిస్తోందని రోహిత్ చెప్పాడు. దాంతో భారత స్పిన్నర్లు ఈ పిచ్పై మరోసారి మ్యాజిక్ను చూపిస్తారని అందరూ అబిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!