NTV Telugu Site icon

Lok Sabha Election: ఐటీ శాఖ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు సీజ్ చేసిందంటే..!

It

It

దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. శనివారం చివరి విడత పోలింగ్ జరగనుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ నిర్వహించిన దాడుల్లో దేశ వ్యాప్తంగా భారీ మొత్తంలో నగదు, నగలు స్వాధీనం చేసుకుంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన దగ్గర నుంచి మే 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఐటీ సోదాల్లో రూ.1100 కోట్ల నగదును అధికారులు సీజ్‌ చేశారు. అలాగే భారీ మొత్తంలో బంగారం కూడా సీజ్‌ చేశారు.

ఇది కూడా చదవండి: Vijay Sethupathi-Fan: అభిమాని ఇంట్లో స్టార్‌ హీరో సందడి.. వీడియో వైరల్!

ఎన్నికల సందర్భంగా ఎలక్షన్‌ కోడ్‌లో భాగంగా దేశ‌వ్యాప్తంగా ఆదాయ‌ప‌న్ను శాఖ నిర్వహించిన సోదాల్లో సుమారు రూ. 1100 కోట్ల న‌గ‌దును సీజ్ చేశారు. మే 30వ తేదీ వ‌ర‌కు ఆదాయ‌ప‌న్ను శాఖ మొత్తం 1100 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని కూడా చేసింది. 2019 నాటి ఎన్నిక‌ల‌తో పోలిస్తే సీజ్ నగదు విలువ దాదాపు 182 శాతం అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ రూ.390 కోట్ల న‌గ‌దును సీజ్ చేశారు.

ఇది కూడా చదవండి: Uttarpradesh : ఉత్తరప్రదేశ్ లో పేలుతున్న ట్రాన్స్ ఫార్మర్లు.. రెండ్రోజుల్లో 166మంది మృతి

ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి ఎన్నిక‌ల కోడ్‌ అమలులోకి వచ్చింది. ఆ నాటి నుంచి ఐటీ శాఖ అన్ని రాష్ట్రాల్లోనూ దాడులు, సోదాలు, త‌నిఖీల‌ు చేపట్టింది. ఓట‌ర్లను ప్రభావితం చేసేందుకు వాడుతున్న డ‌బ్బును సీజ్ చేశారు. ఢిల్లీ, క‌ర్ణాట‌క, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక మొత్తంలో నగదును సీజ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రెండు వంద‌ల కోట్లకు పైగా న‌గ‌దు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో ఏకంగా రూ.150 కోట్ల వ‌ర‌కు నగదును సీజ్ చేశారు. ఇక తెలంగాణ, ఒడిషా, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కలిసి దాదాపు రూ.100 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: K. Laxman: రేవంత్ రెడ్డికి పౌరుషం ఉంటే నిందితులను శిక్షించండి.. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు