Womens T20 Asia Cup : మరోమారు దాయాది దేశాల క్రికెట్ పోరు..
- వచ్చే నెలలో మరో ఇండియా పాకిస్థాన్ క్రికెట్ వార్
- జులై 19నే మరో మ్యాచ్ లో ఇండియా పాకిస్థాన్ టీమ్స్ ఫైట్ చేయబోతున్నాయి.
- జులై 28న ఫైనల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Womens T20 Asia Cup : తాజాగా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఉమెన్స్ టి20 ఏషియా కప్ షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. ఈ మెగా ఈవెంట్ జూలై 19న మొదలు కాబోతోంది. మొదటి మ్యాచ్ జూలై 19న శ్రీలంకలోని డంబుల్లా స్టేడియంలో యూఏఈ – నేపాల్ మధ్య మ్యాచ్ జరుగునుంది. ఇక అదే రోజు సాయంత్రం చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ఇండియన్ ఉమెన్స్ టీం మొదటి మ్యాచ్ లోనే పాకిస్తాన్తో తలబడదునుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.
Oscar Academy : జక్కన్న దంపతులకి అరుదైన గౌరవం..
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ బి లో టీమిండియా తో పాటు పాకిస్తాన్, నేపాల్, యూఏఈ లు కూడా ఉన్నాయి. ఇక మరోవైపు గ్రూప్ ఏ లో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయిలాండ్ దేశాలు ఉన్నాయి. గ్రూప్ దశలలో టాప్ గా నిలిచిన రెండు టీమ్స్ సెమీఫైనల్కు చేరుకుంటాయి. ఇక సెమి ఫైనల్ లో విజేతలుగా నిలిచిన జట్లు జూలై 28న జరగబోయే ఫైనల్ లో తలబడతాయి. కేవలం పది రోజుల్లో ఈ టోర్నీ మొత్తం ముగుస్తుంది. 2022లో జరిగిన ఉమెన్స్ ఏషియా కప్ లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో శ్రీలంకను టీమిండియా ఓడించి ఏడవ సారి టైటిల్ గెలుచుకుంది. ఇప్పటివరకు ఉమెన్స్ క్రికెట్లో అత్యధిక ఏసియా కప్ టైటిల్స్ టీమిండియా పేరు మీదే ఉంది.
Nokia 3210: భారత మార్కెట్లోకి ‘నోకియా 3210’ ఫోన్.. యూపీఐ, యూట్యూబ్ ఫీచర్స్ కూడా!
ఇక 2024 టి20 ఉమెన్స్ వరల్డ్ కప్ అక్టోబర్ నెలలో జరగనుంది. దీంతో అన్ని జట్లకు ఈ ఏషియా కప్ మంచి ప్రాక్టీస్ కాబోతోంది. 2024 వరల్డ్ కప్ కు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది. ఆ ఏషియా కప్ కు శ్రీలంక ఆతిథ్యమిస్తుంది. జులై 19 రాత్రి 7 గంటలకు టీమిండియా, పాకిస్తాన్ జట్లు ఉమెన్స్ ఆసియా కప్ 2024లో తలబడబోతున్నాయి. ఇక ఆ తర్వాత టీమ్ ఇండియాకు జూలై 21 మధ్యాహ్నం రెండు గంటలకు యూఏఈ తో మ్యాచ్ జరగనుంది. జులై 23న మూడో మ్యాచ్లో నేపాల్ తో టీమ్ ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు మొదలు కాబోతుంది.
🚨 News 🚨
Schedule for the upcoming Women’s T20 Asia Cup held in Sri Lanka are out 🙌
Presenting #TeamIndia’s fixtures 💪 #AsiaCup pic.twitter.com/fN2coot72p
— BCCI Women (@BCCIWomen) June 25, 2024
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!