Rajastan : అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హతమార్చిన షాకింగ్ ఘటన రాజస్తాన్ రాష్ట్రం చిత్తోర్గఢ్లో చోటుచేసుకుంది. హత్య అనంతరం నిందితుడు ఘటా రాణి అడవుల్లో తలదాచుకున్నాడు. అయితే పోలీసులు నిందితుడి కోసం అడవిలో గాలింపు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడి పేరు ముఖేష్. నిందితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కనెరా పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది. పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతడిని పోలీసు కస్టడీకి అప్పగించింది.
Read Also: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఇన్స్టాగ్రామ్ చీఫ్ కిడ్నాప్
తన భార్య యోగిత తీరుపై ముఖేష్కు అనుమానం వచ్చింది. ఈ అనుమానంతో ఆమెను ప్రతి రోజు కొట్టేవాడు. బుధవారం రాత్రి కూడా ఎప్పటిలాగే వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. యోగితను ముఖేష్ కొట్టాడు. ముఖేష్ సోదరుడు బాల కిషన్ తన అన్న వదినను కొట్టాడని తెలుసుకున్నాడు. దీంతో వెంటనే బాల్కిషన్ ముఖేష్ ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకోగానే గదిలో యోగిత మృతదేహం కనిపించింది. ఆమె శరీరంపై కొట్టిన గుర్తులు ఉన్నాయి.
Read Also: Ramadan : ఇవాళ నెలవంక కనిపిస్తే రేపు రంజాన్ లేదంటే.. ఇక ఆ రోజే
ఈ ఘటనపై బాలకిషన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ఘటా రాణి అడవిలో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అడవిలో సోదాలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు.