ICC Women’s Cricket World Cup 2025: ప్రపంచ కప్ షెడ్యూల్ను మార్చిన ఐసీసీ.. చిన్నస్వామి స్టేడియం ఔట్..
- ప్రపంచ కప్ షెడ్యూల్ను మార్చిన ఐసీసీ
- చిన్నస్వామి స్టేడియం ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే నెలలో భారతh, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న మహిళల వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్లో ఐసిసి మార్పులు చేసింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం నుండి ఆతిథ్యాన్ని ఐసిసి తొలగించి వేరే స్టేడియంకు మార్చింది. ఈ ప్రపంచ కప్ మ్యాచ్లకు మొత్తం ఐదు స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆ స్టేడియాలలో ఒకటి బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం. దీనిలో ఇకపై మ్యాచ్లు జరగవు. బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్లు ఇకపై నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతాయని ఐసిసి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Also Read:Peddireddy Ramachandra Reddy : చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ఎందుకు అలానే చేయలేదు
Also Read
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
ఈ స్టేడియంలో మొత్తం ఐదు మ్యాచ్లు జరగాల్సి ఉంది. వాటిలో మూడు మ్యాచ్లు లీగ్ దశకు చెందినవి. ఒకటి సెమీ-ఫైనల్ మ్యాచ్. భారత జట్టు ఫైనల్కు చేరుకుంటే, ఈ టైటిల్ మ్యాచ్ కూడా ఈ స్టేడియంలోనే జరిగేది. ఈ మ్యాచ్లన్నీ ఇప్పుడు DY పాటిల్ స్టేడియంలోనే జరుగుతాయి. వాస్తవానికి, కర్ణాటక ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియం మ్యాచ్లను నిర్వహించడానికి సురక్షితం కాదని గుర్తించింది. అందుకే ఈ స్టేడియం నుండి ఆతిథ్యాన్ని ICC తొలగించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టైటిల్ గెలుచుకున్న తర్వాత, M. చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ పరేడ్ జరిగింది. ఈ విజయోత్సవ పరేడ్ సందర్భంగా, స్టేడియం వెలుపల తొక్కిసలాట చోటుచేసుకుంది. దీనిలో 11 మంది మరణించారు. అలాగే, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత, జస్టిస్ జాన్ మైఖేల్ డి’కున్హా అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దర్యాప్తులో M. చిన్నస్వామి స్టేడియం భారీ కార్యక్రమాలకు సురక్షితం కాదని తేలింది.
Also Read:Kurnool : తీవ్ర విషాదం.. నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి
2025 ఐసిసి మహిళల క్రికెట్ ప్రపంచ కప్ మొదటి సెమీ-ఫైనల్ అక్టోబర్ 29 న గౌహతి లేదా కొలంబోలో జరుగుతుంది. రెండవ సెమీ-ఫైనల్ అక్టోబర్ 30 న నవీ ముంబైలో జరుగుతుంది. టోర్నమెంట్ ఫైనల్ నవంబర్ 2 న కొలంబో లేదా నవీ ముంబైలో జరుగుతుంది. పాకిస్తాన్ జట్టు చివరి-4కి అర్హత సాధిస్తే, అది కొలంబోలో మొదటి సెమీ-ఫైనల్ ఆడుతుంది. పాకిస్తాన్ జట్టు ఫైనల్కు చేరుకుంటే, టైటిల్ మ్యాచ్ కూడా కొలంబోలోనే జరుగుతుంది. సెమీఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరిగితే, మొదటి సెమీఫైనల్ కొలంబోలోనే జరుగుతుంది. పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్కు చేరుకోలేకపోతే, అన్ని నాకౌట్ మ్యాచ్లు భారతదేశంలోనే జరుగుతాయి.
Mark your calendars 🗓️
The updated schedule for ICC Women's Cricket World Cup 2025 is out 🏆 #CWC25 | Details 👇 https://t.co/jBoQOHox5V
— ICC (@ICC) August 22, 2025
తాజావార్తలు
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!