Site icon NTV Telugu

Hyderabad: హైదరాబాద్‌లో బంకులు మూసివేత వెనుక అసలు కారణం ఇదే.. కొత్త రూల్స్‌తో జనాల్లో పానిక్!

Hyd

Hyd

Fuel Panic in Hyderabad: నగరంలో ఒక్కొక్కటిగా పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. దీంతో జనాలు ఒక్కసారిగా పానిక్ అవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున నగరంలోని పలు పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిటలాడాయి. పెద్ద ఎత్తున లైన్లు దర్శనమిచ్చాయి. మరోవైపు.. ఎల్‌పీజీ, సీఎన్‌జీ బంకుల్లో ఆటో డ్రైవర్లు పడిగాపులు కాస్తున్నాయి. లక్డీకపూల్, గచ్చిబౌలి, అంబర్‌పేట్, దిల్‌షుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లోని బంకుల్లో ఆటోలను రోడ్లపై నిలిపి వేశారు. ఎల్‌పీజీ, సీఎన్జీ బంకుల్లో ఆలో లైన్లు భారీగా కనిపిస్తున్నాయి. నగదు ఇస్తేనే పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేస్తామంటూ ఆయిల్‌ కంపెనీలు కొత్త మెలిక పెట్టడంతో హైదరాబాద్‌లో కొన్ని బంకులకు సరఫరా నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతిలో నగదు లేక చాలా మంది డీలర్లు పెట్రోల్‌, డీజిల్‌ కొనడం ఆపేశారు. ఇంతకుముందు ఆయిల్‌ కంపెనీలు క్రెడిట్‌ ఇచ్చేవి. అయితే ఈ నెలలో క్రెడిట్‌ సదుపాయం ఇవ్వకపోవడంతో డీలర్లు బంకులను మూసివేసే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు. అయితే మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పెట్రోలియం కంపెనీలు డీలర్లకు ఇప్పటివరకు ఇస్తున్న క్రెడిట్‌ సదుపాయాన్ని పూర్తిగా తొలగించాయి. దీంతో డీలర్లు డబ్బులు చెల్లిస్తేనే ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌లను సరఫరా చేస్తున్నాయి. ఇక ఈ అంశంపై పెట్రోల్ బంకు యజమాలనులు మాట్లాడుతూ.. మార్చి 31వరకు అమల్లో ఉండే ఆయిల్‌ కంపెనీల నిబంధనలే తాజా పరిస్థితికి కారణమని చెబుతున్నారు. ఇంధన సరఫరాలో ఎలాంటి కొరత లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని డీలర్లు, పెట్రోలియం శాఖ వెల్లడించింది.

READ MORE: Military Plane Crashed: ఘోర ప్రమాదం.. కూలిన సైనిక విమానం.. 110 మంది సైనికులు!

Exit mobile version