Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Hyderabad Metro Phase 2 Expansion Medchal Shamirpet

Hyderabad Metro : మేడ్చల్, శామీర్ పేట్ కారిడార్లకు వినూత్న మెట్రో మార్గాలు

Published Date :January 19, 2025 , 4:57 pm
By Gogikar Sai Krishna
  • ఈ రెండు కారిడార్ల తో ఎయిర్ పోర్ట్ కారిడార్ అనుసంధానం
  • ముఖ్యమంత్రి దార్శనికతకు అద్దం పట్టేలా జేబీఎస్ వద్ద ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ మెట్రో రైల్ హబ్‌
  • మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి క్షేత్ర స్థాయి పరిశీలన
Hyderabad Metro : మేడ్చల్, శామీర్ పేట్ కారిడార్లకు వినూత్న మెట్రో మార్గాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రెండవ దశలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా మేడ్చల్, శామీర్ పేట్ దిశగా సాగే కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతకు అనుగుణంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సారథ్యంలో సాంకేతిక నిపుణులు, అధికారులు హైదరాబాద్ ప్రజల సౌకర్యవంతమైన ప్రయాణానికి కొత్త మెట్రో మార్గాలను రూపొందించే కసరత్తును ప్రారంభించారు. ప్యారడైజ్ – మేడ్చల్ (23 కి.మీ); జేబీఎస్ – శామీర్ పేట్ (22 కి.మీ) ప్రతిపాదిత కారిడార్ అలైన్మెంట్ ల విషయంలో ఉన్న సాంకేతిక సవాళ్లను పరిష్కరించడానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఇంజినీర్లు, సాంకేతిక సలహాదారులు నేడు (ఆదివారం) క్షేత్ర పరిశీలన జరిపారు. ఈ రెండు కారిడార్ల ఏర్పాటులో ఇంజినీరింగ్ పరంగా ఎదురవుతున్న కొన్ని సంక్లిష్ట అంశాలను గుర్తించారు.

బేగంపేట్ విమానాశ్రయ సరిహద్దు వెంబడి ప్యారడైజ్ నుండి బోయినపల్లి వరకు రోడ్డు వంపు చాల ఎక్కువగా ఉండటం , విమానాశ్రయ అధికారుల ఆంక్షల కారణంగా, హెచ్ఏండీఎ తన ఎలివేటెడ్ మార్గాన్ని కొంత దూరం పాటు భూగర్భ మార్గంగా మార్చుకుంది. ఈ అలైన్‌మెంట్‌ను బేగంపేట విమానాశ్రయం (తాడ్‌బండ్/బోయినపల్లి వైపు) రన్‌వే క్రింద దాదాపు 600 మీటర్ల దూరం భూగర్భ సొరంగం ద్వారా తీసుకువెళ్తుంది.

హెచ్ఎండీఏ మార్గానికి అనుసంధానంగా రెండు స్థాయిల పైన ఉండే డబుల్ ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని ఈ భూగర్భ సొరంగంలోనికి దింపి, మళ్ళీ రెండు స్థాయిల ఎలివేటేడ్ మార్గంగా పైకి తీసుకురావడం అనేది ఇంజినీరింగ్ పరంగా అనేక సమస్యల్ని సృష్టిస్తుంది.

ఈ సమస్యలను విశ్లేషించి అనువైన మార్గానికి ప్రణాళికలు సిద్ధం చేయడానికి మెట్రో అధికారులు నడుం బిగించారు. ముఖ్యమంత్రి సూచించిన ప్రకారం మేడ్చల్, శామీర్ పేట్ కారిడార్ ల ప్రారంభం స్థానాన్ని జేబీఎస్ వద్ద ఏకీకృతం చేయడం, ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఒక హబ్ ని ఏర్పాటు చేయడం, ఈ కారిడార్లు కొంత దూరం వెళ్లిన తర్వాత వాటిని విడదీసి, రెండు మెట్రో కారిడార్లు గా రూపొందించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తన క్షేత్ర పర్యటనను కొనసాగించారు మెట్రో ఎండీ. తన బృందంతో కలిసి కంటోన్మెంట్ ప్రాంతంలోని అనేక ప్రత్యామ్నాయ రోడ్లపై పూర్తిగా నడిచి, సాధ్యమైనంత ఉత్తమమైన మెట్రో రైలు అలైన్‌మెంట్‌ ఏర్పాటుకు పరిశీలనలు జరిపారు.

జేబీఎస్ – సికింద్రాబాద్ క్లబ్‌రోడ్, స్టాఫ్ రోడ్ (పికెట్ కేంద్రీయ విద్యాలయ స్కూల్ రోడ్), మడ్ ఫోర్ట్ రోడ్, టివోలి జంక్షన్ రోడ్, డైమండ్ పాయింట్ జంక్షన్, సెంటర్ పాయింట్ జంక్షన్, హస్మత్‌పేట్ జంక్షన్, బోయినపల్లి (సరోజిని పుల్లారెడ్డి బంగ్లా) రోడ్; తాడ్‌బండ్-ఆంజనేయ స్వామి ఆలయం రోడ్ – తాడ్‌బండ్ జంక్షన్ – ఎయిర్ పోర్ట్ ఆఫీస్ జంక్షన్ – బోయినపల్లి చెక్ పోస్ట్ రోడ్ మొదలైనవి వీరు కాలినడకన పరిశీలించిన మార్గాలలో ఉన్నాయి. క్లిష్టమైన మలుపులను, విమానాశ్రయం కింద భూగర్భంలో అలైన్‌మెంట్ ను తీసుకువెళ్లే ఆవశ్యకతను నివారించే విధంగా, ప్రైవేట్ ఆస్తుల సేకరణను వీలైనంత తగ్గించే విధంగా ప్రత్యామ్నాయ మార్గాల లాభనష్టాలను అంచనా వేయాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అధికారులకు సూచించారు. అలైన్‌మెంట్ వీలైనన్ని ఎక్కువ నివాస కాలనీలకు, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ప్రయోజనకరంగా ఉండాలని, స్టేషన్ స్థానాల నిర్ధారణ, వాటి సమీపంలో ఖాళీగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ/రక్షణ భూముల లభ్యత, మెరుగైన పార్కింగ్, ప్రయాణీకులకు కల్పించే సౌకర్యాలను గుర్తించాలని కూడా ఆయన ఆదేశించారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్టుగా జేబీఎస్ వద్ద ప్రారంభంలో రెండు మెట్రో కారిడార్‌లను కలపడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని శ్రీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. దీనివల్ల బేగంపేట్ విమానాశ్రయం దిగువన సొరంగం ద్వారా మెట్రో అలైన్‌మెంట్‌ను తీసుకెళ్లాల్సిన పరిస్థితిని నివారించి, బోయినపల్లి రోడ్ (సరోజినీ పుల్లారెడ్డి బంగ్లా పక్కన) చివరన ఉన్న జాతీయ రహదారి జంక్షన్ వద్ద అలైన్‌మెంట్‌ను అనుసంధానించవచ్చని, అక్కడ నుండి ఇప్పటి కే విస్తరించి న జాతీయ రహదారి సర్వీస్ లేన్ పై మెట్రో స్తంభాలను, వయాడక్టును జాతీయ రహదారుల సంస్థ నిర్మిస్తున్న ఫ్లైఓవర్ లకు అంతరాయం కలగకుండా నిర్మించవచ్చని అన్నారు. దీనితో మేడ్చల్-జేబీఎస్-ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట-విమానాశ్రయ లింక్ కూడా ఏర్పడుతుందని, దాదాపు 60 కిలోమీటర్ల సుదీర్ఘ మెట్రో కారిడార్ ఏర్పాటు సాధ్యమవుతుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. జేబీఎస్-శామీర్ పేట్ మెట్రో అలైన్‌మెంట్ విషయానికొస్తే, సికింద్రాబాద్ క్లబ్ సమీపంలో ఉన్న ప్రస్తుత మొదటి మెట్రో పిల్లర్ నుండి డబుల్ ఎలివేటెడ్ స్ట్రక్చర్‌గా కరీంనగర్ హైవేపై హెచ్‌ఎండీఏ నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్‌పై నేరుగా పొడిగించవచ్చని ఆయన వివరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి వచ్చే వారితోపాటు, సికింద్రాబాద్ , నగరంలోని ఉత్తర ప్రాంతాల నివాసితుల రాకపోకలు , ఇతర అవసరాలను తీర్చడానికి జేబీఎస్ ను ఒక ప్రపంచ స్థాయి మెట్రో హబ్‌గా అభివృద్ధిచేసే ప్రణాళికలు రూపొందిస్తామని మెట్రో ఎండీ తెలిపారు. ఇందు కోసం జేబీఎస్ పరిసరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, రక్షణ శాఖకు చెందిన సుమారు 30 ఎకరాల భూమిని సమీకరించవచ్చని ఆయన వెల్లడించారు. ఈ క్షేత్ర పర్యటనలో హెచ్ఏఎంఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్లు బి.ఎన్. రాజేశ్వర్, ఎం. విష్ణు వర్ధన్ రెడ్డి, ఎ. బాలకృష్ణ, డిప్యూటీ సిఇ (రైల్వేస్) జె.ఎన్. గుప్తా, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌ని పొడిచింది బంగ్లాదేశ్ వ్యక్తి.. పోలీసులకు ఎలా చిక్కాడంటే..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Begumpet Metro Tunnel
  • Hyderabad Metro Phase 2
  • Hyderabad Urban Development
  • Medchal Metro Corridor
  • Metro Double Elevated Corridor

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions