Hyderabad Traffic Marshals: 100 మంది ట్రాఫిక్ మార్షల్స్.. బైక్లకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్!
- మార్షల్స్లకు 50 పెట్రోలింగ్ బైక్లు
- 100 మంది ట్రాఫిక్ మార్షల్స్ విధులు
- రోజు రోజుకు హైదరాబాద్లో వాహనాల రద్దీ
- ఎన్ని వాహనాలు ఇచ్చినా పోలీస్ శాఖకు సరిపోవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో 50 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్లను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. సెక్యూరిటీ కౌన్సిల్స్ ఆధ్వర్యంలో 100 మంది ట్రాఫిక్ మార్షల్స్ విధులు నిర్వర్తించనున్నారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను బలోపేతం చేయడానికి వంద మంది మార్షల్స్లకు 50 బైక్లను సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్ షిప్లో భాగంగా ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడంతో పాటు వాహనాలు సజావుగా, సాఫీగా వెళ్లేందుకు ట్రాఫిక్ పెట్రోలింగ్ బైకులు సహకరించనున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్లో వాహనాలను అందించడం ద్వారా ఇంకా మంచి సర్వీసు అందించగలుగుతాం అని సీవీ ఆనంద్ ధీమా వ్యక్తం చేశారు.
‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ని వాహనాలు ఇచ్చినా పోలీస్ శాఖకు సరిపోవు. అందుకే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్లో వాహనాలను అందించడం ద్వారా ఇంకా మంచిగా సర్వీసు అందించగలుగుతాం. నగరంలో 650 జంక్షన్లు ఉన్నాయి. రోజు రోజుకు హైదరాబాద్లో వాహనాలు రద్దీ పెరుగుతుంది. నగరంలో గంటకు 18 కిమి వేగం నుంచి 23 కిమి వరకు పెరిగింది. దేశంలోనే మొదటిసారి ట్రాన్జెండర్లను ట్రాఫిక్లో నియమించాము. జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖల్లోనూ రాబోయే రోజుల్లో ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించడం కోసం చర్యలు చేపడుతుంది ప్రభుత్వం. ట్రాఫిక్ మార్షల్స్ సంబంధిత పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సైలు పర్యవేక్షణలో పనిచేస్తారు. ట్రాఫిక్ మార్షల్స్కు చాలా ఆలోచించి చర్చించిన తరువాతే ట్రాఫిక్ సిబ్బంది డ్రెస్లను ఇచ్చాము’ అని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.
Also Read
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
Also Read: Maoist Sunitha: లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత సునీత!
‘రాబోయే రోజుల్లో 500 మందికి ట్రాఫిక్ మార్షల్స్ పెరుగుతాయని అనుకుంటున్నాం. ట్రాఫిక్ మార్షల్స్ చాలా బాధ్యతగా వ్యవహరించాలి. తప్పు చేయకూడదన్న భావనతోనే విధులు నిర్వహించాలి. ట్రాఫిక్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలి. ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్లనుకు క్యాష్ బోర్డు కెమెరాలు ఏర్పాటు చేశాము. బైక్ నడుపుతున్న వారికి బాడీవేర్ కెమెరా ఉంటుంది. మూడు క్రేన్స్ కూడా అందుబాటులోకి తెచ్చాము’ అని హైదరాబాద్ సీపీ తెలిపారు. ట్రాఫిక్ మార్షల్స్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు సహాయపడనున్నారు. వీరు ట్రాఫిక్ పోలీసులకు సహాయకులుగా ఉండి.. ట్రాఫిక్ జామ్ లను తగ్గించడానికి, ట్రాఫిక్ నియమాలను పాటించేలా చూడటానికి పనిచేస్తారు.
తాజావార్తలు
-
Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
-
Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
-
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!