Hyderabad Traffic Marshals: 100 మంది ట్రాఫిక్ మార్షల్స్.. బైక్లకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్!
- మార్షల్స్లకు 50 పెట్రోలింగ్ బైక్లు
- 100 మంది ట్రాఫిక్ మార్షల్స్ విధులు
- రోజు రోజుకు హైదరాబాద్లో వాహనాల రద్దీ
- ఎన్ని వాహనాలు ఇచ్చినా పోలీస్ శాఖకు సరిపోవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో 50 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్లను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. సెక్యూరిటీ కౌన్సిల్స్ ఆధ్వర్యంలో 100 మంది ట్రాఫిక్ మార్షల్స్ విధులు నిర్వర్తించనున్నారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను బలోపేతం చేయడానికి వంద మంది మార్షల్స్లకు 50 బైక్లను సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్ షిప్లో భాగంగా ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడంతో పాటు వాహనాలు సజావుగా, సాఫీగా వెళ్లేందుకు ట్రాఫిక్ పెట్రోలింగ్ బైకులు సహకరించనున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్లో వాహనాలను అందించడం ద్వారా ఇంకా మంచి సర్వీసు అందించగలుగుతాం అని సీవీ ఆనంద్ ధీమా వ్యక్తం చేశారు.
‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ని వాహనాలు ఇచ్చినా పోలీస్ శాఖకు సరిపోవు. అందుకే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్లో వాహనాలను అందించడం ద్వారా ఇంకా మంచిగా సర్వీసు అందించగలుగుతాం. నగరంలో 650 జంక్షన్లు ఉన్నాయి. రోజు రోజుకు హైదరాబాద్లో వాహనాలు రద్దీ పెరుగుతుంది. నగరంలో గంటకు 18 కిమి వేగం నుంచి 23 కిమి వరకు పెరిగింది. దేశంలోనే మొదటిసారి ట్రాన్జెండర్లను ట్రాఫిక్లో నియమించాము. జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖల్లోనూ రాబోయే రోజుల్లో ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించడం కోసం చర్యలు చేపడుతుంది ప్రభుత్వం. ట్రాఫిక్ మార్షల్స్ సంబంధిత పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సైలు పర్యవేక్షణలో పనిచేస్తారు. ట్రాఫిక్ మార్షల్స్కు చాలా ఆలోచించి చర్చించిన తరువాతే ట్రాఫిక్ సిబ్బంది డ్రెస్లను ఇచ్చాము’ అని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.
Also Read
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
- Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
Also Read: Maoist Sunitha: లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత సునీత!
‘రాబోయే రోజుల్లో 500 మందికి ట్రాఫిక్ మార్షల్స్ పెరుగుతాయని అనుకుంటున్నాం. ట్రాఫిక్ మార్షల్స్ చాలా బాధ్యతగా వ్యవహరించాలి. తప్పు చేయకూడదన్న భావనతోనే విధులు నిర్వహించాలి. ట్రాఫిక్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలి. ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్లనుకు క్యాష్ బోర్డు కెమెరాలు ఏర్పాటు చేశాము. బైక్ నడుపుతున్న వారికి బాడీవేర్ కెమెరా ఉంటుంది. మూడు క్రేన్స్ కూడా అందుబాటులోకి తెచ్చాము’ అని హైదరాబాద్ సీపీ తెలిపారు. ట్రాఫిక్ మార్షల్స్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు సహాయపడనున్నారు. వీరు ట్రాఫిక్ పోలీసులకు సహాయకులుగా ఉండి.. ట్రాఫిక్ జామ్ లను తగ్గించడానికి, ట్రాఫిక్ నియమాలను పాటించేలా చూడటానికి పనిచేస్తారు.
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!