Site icon NTV Telugu

Kadapa: ఆ కారణంతో.. భార్యపై భర్త దారుణం..

Dead

Dead

నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సిన భార్యాభర్తలు క్షణికావేశాలతో దారుణాలకు ఒడిగడుతున్నారు. అనుమానం పెనుభూతమై భార్యలను అంతమొందిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కడపలో చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తె ఆమె పాలిట కాలయముడిగా మారారు. అనుమానం పెనుభూతంగా మారి ఆ పచ్చని కుటుంబంలో చిచ్చు లేపింది. చెన్నూరు మండలం కొత్త గాంధీ నగర్ లో భార్యపై అనుమానంతో, భర్త ఆమెను హత్య చేసి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read:Astrology: జూన్ 1, ఆదివారం దినఫలాలు

కువైట్ నుంచి 11 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన నిత్యానంద్ తన భార్య లక్ష్మీ కుమారి పై అనుమానం పెంచుకున్నాడు. ఈ కారణంతో ఇరువురి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవని బంధువుల ఆరోపిస్తున్నారు. ఆ అనుమానంతోనే ఆదివారం తెల్లవారుజామున లక్ష్మీ కుమారిని నిత్యానంద్ గొంతకు తాడుతో బిగించి చంపాడు. ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇరువురిమృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Exit mobile version