Kaleshwaram Report: కాళేశ్వరం నివేదికపై నాలుగు రోజులైనా చర్చకు సిద్ధం: హరీష్ రావు
Kaleshwaram Report: శాసన సభలో కాళేశ్వరం కమిషన్పై చర్చ మొదలైంది. ఈసందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 650 పేజీల పుస్తకం ఇచ్చి అరగంట మాట్లాడాలి అంటే ఎలా అని ప్రశ్నించారు. వరదలు, యూరియా కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదలపై చర్చిద్దామని బీఏసీలో కోరామని, వరద సమస్య ముఖ్యం కాదని ప్రభుత్వం అనుకుందని చెప్పారు. కాళేశ్వరం నివేదికపై నాలుగు రోజులైనా చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు, తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, క్రాస్ ఎగ్జామినేషన్కు కూడా నోటీసులు ఇవ్వలేదని, ఘోష్ కమిషన్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. కమిషన్లను రాజకీయ ఆయుధాలుగా వాడుకోవద్దని కోర్టులు గతంలోనే చెప్పాయని గుర్తు చేశారు. నిబంధనలు అనుసరించలేదనే కోర్టుకు వెళ్లామని చెప్పారు. ఆదివారం రిపోర్ట్ పెట్టారంటేనే కుట్ర ఉన్నట్లు, అందుకే సుప్రీంకోర్టులో సీఎం కేవియేట్ వేశారని అన్నారు. కోర్టులో వాదనలు ఉన్నాయనే ఆదివారం కూడా చర్చ పెట్టారు, పారదర్శకంగా విచారణ జరగకపోతే అవి చిత్తు కాగితంతో సమానమని కోర్టులు చెప్పాయని గుర్తు చేశారు.
READ ALSO: Ram Charan : రామ్ చరణ్ కు సీఎం ఆత్మీయ సన్మానం
Also Read
- Assembly Elections: తమిళనాడు, బెంగాల్లో పోటాపోటీగా పోలింగ్.. ఉ.11 గంటలకు భారీగా ఓటింగ్
- Venkata Krishnapuram Crime: లీడ్ కనుక్కునేందుకు ఎవ్వరూ ప్రాణాలతో లేరు.. వెంకటకృష్ణపాలెంలో విషాదంపై పుత్తూరు డీఎస్పీ!
- Mukesh Choudhary: ఐపీఎల్ నుండి మధ్యలోనే మరో CSK ప్లేయర్ అవుట్..!
- Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్ఫైర్ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో
వాస్తవాలు ప్రజలకు తెలియాలని, నాలుగు రోజులైన చర్చ చేస్తామని చెప్పారు. కానీ అరగంట సమయం ఇస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లు ప్రభుత్వం నడుపుతున్నారా… సర్కస్ నడుపుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. 1952 యాక్ట్ రక్షణ ఉందని, శాసన సభ్యుడి మీద ఆరోపణలు చేయాలంటే…సభ్యుడికి నోటీస్ ఇవ్వాలని అన్నారు. మేడిగడ్డలో లోపం లేక ముందే తప్పుడు ఆరోపణలు చేసిందని, ఘోష్ కమీషన్ రాజ్యంగా ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. తమకు 8 b కింద నోటీస్ లు ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఆనాడు షా కమిషన్ ఇందిరాగాంధీకి 8B కింద నోటీసులు ఇచ్చింది. అయినా ఇందిరాగాంధీ కోర్టుకు వెళ్తే షా కమిషన్ను కొట్టివేసిందన్నారు. LK అద్వానీపై కమిషన్ వేస్తే అన్యాయమని బీజేపీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేసింది. ప్రోసీజర్ అనుసరించలేదని ఆనాడు లిబ్రహాన్ కమిషన్ను కోర్టు కోట్టివేసింది. రిపోర్టును క్వాష్ చేయాలనే మేం కోర్టుకు వెళ్లాం. సభలో చర్చ చేయొద్దని కోర్టుకు వెళ్లలేదని చెప్పారు.
READ ALSO: Kadiyam Srihari : దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ పూర్తి దిశగా కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Assembly Elections: తమిళనాడు, బెంగాల్లో పోటాపోటీగా పోలింగ్.. ఉ.11 గంటలకు భారీగా ఓటింగ్
-
Venkata Krishnapuram Crime: లీడ్ కనుక్కునేందుకు ఎవ్వరూ ప్రాణాలతో లేరు.. వెంకటకృష్ణపాలెంలో విషాదంపై పుత్తూరు డీఎస్పీ!
-
Mukesh Choudhary: ఐపీఎల్ నుండి మధ్యలోనే మరో CSK ప్లేయర్ అవుట్..!
-
Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్ఫైర్ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో
-
Ranveer Singh : దీపికాకు పూర్తి ఆపోజిట్గా వ్యవహరిస్తున్న రణవీర్ సింగ్
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?