Site icon NTV Telugu

Jharkhand: పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు బోల్తా.. ఐదుగురు మృతి, 25 మందికి గాయాలు

Jarkhand

Jarkhand

జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ బృందం ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 25 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లా నుండి మహువాదర్‌కు వెళ్తున్న బస్సు మహువాదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓర్సా లోయ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని, సహాయక చర్యలు ప్రారంభించామని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని జార్ఖండ్ పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమేమిటో స్పష్టంగా తెలియదని, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

Also Read:Allu Arjun-Kollywood: కోలీవుడ్ టాప్ డైరెక్టర్‌లతో అల్లు అర్జున్ సినిమాలు.. అందుకోసమేనా?

ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బాధితులకు తక్షణ సహాయం అందించాలని లతేహార్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గత 24 గంటల్లో జార్ఖండ్‌లో జరిగిన మూడవ పెద్ద ప్రమాదం ఇది. శనివారం రాత్రి, డియోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘాసిదిహ్ గ్రామం సమీపంలో కారులో ప్రయాణిస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరొకరు గాయపడ్డారు. వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Exit mobile version