అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఏడుగురు మరణించారు. మరో 40మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ ల సహాయంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు, బస్సు ఢీ కొనడంతో బస్సు నుజ్జునుజ్జ అయింది. దీంతో గాయపడిన వారిని బస్సు నుంచి బయటకు తీసేందుకు సహాయక సిబ్బందికి కష్టతరంగా మారింది.
Also Read : Maoist : హన్మకొండలో మావోయిస్టు అగ్రనేత దేవేందర్ రెడ్డి అరెస్ట్
లక్నో-గోరఖ్ పూర్ హైవే పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కువ స్తున్న క్రమంలో ప్రైవేట్ బస్సు అంబేద్కర్ నగర్ వైపు వెళ్లేందుకు హైవేపై టర్న్ తీసుకుంటుంది. దీంతో ఎదురుగా వస్తున్న లారీని బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్రక్కు బోల్తాపడి బస్సు కిందపడిపోయిందని ఆయోధ్య చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ వెల్లడించారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారని.. 40 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాద ఘటనపై యూపీ సీఎం ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపినట్లు సీఎంఓ హిందీలో ఓ ట్వీట్ చేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ముఖ్యమంత్రి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
Also Read : Family Dispute : అన్నం వండలేదని బాలింతను కొట్టి చంపిన భర్త