Bandh Continue In Medak: మెదక్ జిల్లాలో ఇవాళ (సోమవారం) బంద్కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. గోవుల రక్షణకు చేసిన ప్రయత్నంలో హిందువులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించారని పేర్కొన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ నేడు జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ, బీజేవైఎం తెలిపాయి. జిల్లా బంద్కు ప్రజలు సహకరించాలని సందర్భంగా వారు కోరాయి.
Read Also: Uttam Kumar Reddy : కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలి
కాగా, శనివారం రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ, పరస్పర దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఈ క్రమంలో బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదివారం సైతం మెదక్ పట్టణంలో బంద్ కు పిలుపనివ్వడంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంక్లు, హోటళ్లు, దుకాణాలు స్వచ్చందంగా క్లోజ్ చేశారు. బస్టాండ్లు, చౌరస్తాల దగ్గర పోలీసులు పికెట్ ఏర్పాటు చేయడంతో పాటు పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహించారు.. దీంతో ఆర్టీసీ బస్సులు నడిచాయి. ఇక, ఈ ఘటనపై రంగంలోకి దిగిన మల్టీజోన్ ఐజీ రంగనాథ్ మెదక్ పట్టణానికి వచ్చి ఎస్పీ బాలస్వామితో కలిసి పరిస్థితి గురించి సమీక్ష నిర్వహించారు.
Read Also: youtube: యూట్యూబ్ యూజర్స్ ఎక్కువగా వేటి కోసం సర్చ్ చేస్తున్నారో తెలుసా..?
అలాగే, శనివారం జరిగిన గొడవలు, దాడులకు కారణమైన ఇరు వర్గాలకు చెందిన 45 మందిని గుర్తించామని ఐజీ రంగనాథ్ చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటికే మూడు కేసులు నమోదు చేసి ఓ వర్గానికి చెందిన తొమ్మిది మందిని అరెస్ట్ చేశామన్నారు. మరో వర్గానికి చెందిన వారిని సైతం అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఈ ఇష్యూపై ఎంపీ రఘునందన్ రావుతో ఐజీ ఫోన్ లో మాట్లాడారు. ఘటనకు బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకుంటున్నామని ఎంపీకి ఆయన హామీనిచ్చారు. ఐజీ హామీతో మెదక్ కు రాకుండా మధ్యలోనే ఎంపీ రఘునందన్ రావు ఆగిపోయారు.