Anjali Sharma: ఆఫ్రికన్ జాతీయుడిని వివాహం చేసుకున్న హిమాచల్ పర్వతారోహకురాలు.. మొదటగా ఎక్కడ కలిశారంటే?

  • ఆఫ్రికన్ జాతీయుడిని వివాహం చేసుకున్న హిమాచల్ పర్వతారోహకురాలు
  • వైవ్స్ కజియుకా వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్
  • అంజలి మాస్కోలో య్వెస్‌ను మొదటిసారిగా కలిశారు
Anjali Sharma

Anjali Sharma

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన పర్వతారోహకురాలు అంజలి శర్మ ఆఫ్రికన్ దేశమైన రువాండాకు చెందిన వైవ్స్ కాజియుకాను ధర్మశాలలో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ధర్మశాలలోని గమ్రు నివాసి అయిన అంతర్జాతీయ పర్వతారోహకురాలు అంజలి మాస్కోలో య్వెస్‌ను మొదటిసారిగా కలిశారు. ఈ కలయికే వివాహబంధానికి దారితీస్తుందని ఊహించలేదని తెలిపారు. వారిద్దరూ హిందూ ఆచారాల ప్రకారం మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Also Read:స్ప్రౌట్స్ తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే !

వైవ్స్ కజియుకా వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్. ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్నాడు. అతను ఇప్పటికీ అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అంజలి రెండు ప్రపంచ పర్వతారోహణ రికార్డులు సృష్టించింది. ఆమె టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని, రష్యాలోని మౌంట్ ఎల్బస్‌ను అధిరోహించింది. అంతేకాదు హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రధాన శిఖరాలను కూడా అధిరోహించింది.

Also Read:Mangli: మంగ్లీపై అసభ్యకర వ్యాఖ్యలు.. మేడిపల్లి స్టార్ అరెస్ట్..

అంజలి తండ్రి 2009లో మరణించారు. ఆమె తల్లి పుష్ప శర్మ తన కుమార్తెను పెంచింది. తనకు ఎదురైన సవాళ్లను అధిగమించి, అంజలి అనేక పర్వత శిఖరాలను జయించింది. ఇప్పుడు, ఈ జంట కలిసి పర్వతారోహణ చేయనున్నారు. వారి జీవితాలు ఇప్పుడు కలిసి పర్వతారోహణలో కొత్త రికార్డులు సృష్టించడం గురించి ఉంటుందని అంజలి చెప్పారు. తన భర్తతో కలిసి పర్వతారోహణలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని అంజలి చెప్పారు.