Site icon NTV Telugu

Singareni Elections: సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

Singareni

Singareni

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27న ఎన్నికలు జరిపేందుకు హైకోర్టు వీలు కల్పించింది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్ కొట్టివేసింది న్యాయస్థానం. ఇంతకుముందు.. ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఈ పిటిషన్‌ను ఈరోజు విచారించగా.. ఎన్నికలు జరుపుకోవచ్చని తెలిపింది.

Read Also: Bhatti Vikramarka: విద్యుత్ రంగంలో అరాచకం సృష్టించారు..

కాగా.. 2017లో జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నాలుగేళ్ల క్రితమే నిర్వహించాల్సి ఉంది. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి, ఎన్నికల నిర్వహణపై నాలుగేళ్లుగా హైకోర్టులో వివాదం నడుస్తోంది. యాజమాన్యం, ప్రభుత్వం, కార్మిక సంఘాలు వేర్వేరు కారణాలతో ఎప్పటికప్పుడు హైకోర్టును ఆశ్రయిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన ఎన్నికలను కోర్టు జోక్యంతో అక్టోబర్ 30న నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు కార్మిక శాఖ కూడా ఎన్నికలకు సిద్ధమై సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగింది. నామినేషన్లు, ఉపసంహరణలు, మార్కుల కేటాయింపు తర్వాత కొన్ని కార్మిక సంఘాలు మళ్లీ సింగరేణి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల మరియు ఎన్నికల నిర్వహణ కారణంగా, గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని అభ్యర్థించారు. డిసెంబర్ 27న మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఫుల్ బెంచ్ సూచించగా.. ఆర్ఎల్సీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసన్ ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించారు.

Exit mobile version