Musi River: ఉప్పొంగుతున్న మూసీ నది.. భయం గుప్పిట్లో ప్రజలు..
Musi River: హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతుంతి. బంజారా, పికెట్, కూకట్ పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద వచ్చి చేరుతుంది. హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. హుస్సేన్ సాగర్ లో 513.43 మీటర్లుగా ఉన్న ప్రస్తుత నీటి మట్టం కాగా.. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లకు చేరింది. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసిలోకి వదులుతున్న అధికారులు. మూసి పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది.
Read also: Nagarjuna Sagar: మళ్లీ కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తివేత…
Also Read
- Fuel Shortage Telangana : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై సివిల్ సప్లై శాఖ కీలక ప్రకటన
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
- MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
- Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
రెండురోజులుగా కురుస్తున్న వానలకు హైదరాబాద్ వాసుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు జంట జలాశయాల నుంచి విడుదల చేసిన నీటితో మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పరిహాక ప్రాంతాల ప్రజలు… భయంతో అల్లాడుతున్నారు. పురానాపూల్ ముద్ద నీటితో నిండిపోయింది. భారీగా వరద నీరు చేరడంతో పరిసర ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. పురానాపూల్, జియాగూడ ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జియాగూడ ప్రాంతంలో చెరువులకు వెళ్లే రహదారులతో వాహనాల రాకపోకలను నియంత్రించారు. చాదర్ఘాట్, ముసారాంబాగ్ వంతెనలపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ట్రాఫిక్ను నిలిపివేశారు.
Read also: Re – Release : మురారి, ఇంద్ర రీరిలీజ్ రికార్డులు బద్దలు కొట్టిన.. గబ్బర్ సింగ్..
ముసారాంబాగ్ వంతెన మూసివేయడంతో అంబర్పేట నుంచి దిల్సుఖ్నగర్కు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూసా నగర్, కమలా నగర్ పరిసరాలు మూసాయి వరద ముంపునకు గురైంది. మూసీ పరివాహక ప్రాంతంలోని చాదర్ఘాట్, మూసానగర్, శంకర్నగర్ కాలనీల వాసులను అధికారులు అప్రమత్తం చేసి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాగోల్ పరిధిలోని అయ్యప్పకాలనీ కూడా వరద నీటిలో చిక్కుకుంది. ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం రుద్రవల్లి గ్రామ శివారులోని లోలెవల్ వంతెనపై నుంచి ఎగువన ప్రవహిస్తోంది. దీంతో భూదాన్ పోచంపల్లి మండలంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద… లోలెవల్ వంతెనపై నుంచి మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
Red Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..
-
MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
-
Thyroid Health : వారసత్వంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయా.? నిపుణులు చెబుతున్న కీలక సూత్రాలు..!
-
Oil Crisis: భారత్కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో