Arvind Kejriwal: నేడు సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ

Arvind Kejriwal

Arvind Kejriwal

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై తీర్పు వెలువరించే అవకాశం ఉందని అంచనా. ఈ కేసును న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారించనుంది. కేసు సాధారణ కేసుగా నమోదు చేయబడింది. కాగా.. అరవింద్ కేజ్రీవాల్‌కు జూన్ ఒకటో తేదీ వరకు సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ లభించిందని తెలిసిందే. మధ్యంతర బెయిల్‌పై విచారణ సందర్భంగా, ‘మీరు చర్చకు ఏదైనా జోడించాలనుకుంటే, మీరు దానిని జోడించవచ్చు అని ఎస్ జీకీ సుప్రీంకోర్టు తెలిపింది. దానిపై తాను అఫిడవిట్ దాఖలు చేశానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.

READ MORE: NIA: మణిపూర్‌‌లో హింసకు మయన్మార్‌లో ప్లాన్: ఎన్‌ఐఏ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. అప్పటి నుంచి తిహార్ జైలులో ఉన్నారు. జూన్ ఒకటి వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. నిజానికి, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్ బెయిల్ కోసం ఆర్డర్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్‌ను జారీ చేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ముఖ్యమంత్రిగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించకూడదని, కానీ పార్టీ చీఫ్‌గా ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని తెలిపింది. తిరిగి జూన్ 2న సరెండర్ కావాలని కేజ్రీవాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. జూన్‌ 1న పార్లమెంట్ ఎన్నికల చివరి ఫేజ్ ముగియనుంది. ఇక ఢిల్లీ పరిధిలోని 7 పార్లమెంట్ స్థానాలకు మే 25న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.