INDvsAUS 2nd Test: రెండో రోజు ఆట సమాప్తం.. ఆసీస్ 61/1
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరుజట్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 12 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 61 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఒక పరుగు లీడ్తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (6)ను జడేజా ఔట్ చేయడంతో 23 రన్స్ వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే ట్రెవిస్ హెడ్ (40 బంతుల్లో 39 బ్యాటింగ్), లబుషేన్ (19 బంతుల్లో 16 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా ఆడారు. వీరిద్దరూ వేగంగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ప్రస్తుతం ఆసీస్ 62 పరుగులు ఆధిక్యంలో ఉంది.
ఆదుకున్న అక్షర్, అశ్విన్..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
అంతకుముందు, తొలి ఇన్నింగ్స్లో భారత్ 270 రన్స్కు ఆలౌటైంది. 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్ పటేల్, రవి అశ్విన్ సెంచరీ భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఓవర్నైట్ స్కోరు 21/0తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రాహుల్ (17 లియోన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న రోహిత్ (32)తో పాటు వందో టెస్టు ఆడుతున్న పుజారా(0)ను ఒకే ఓవర్లో ఔట్ చేసిన లియోన్.. టీమిండియాను గట్టి దెబ్బ తీశాడు. ఇక కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్ (4) కూడా పెవిలియన్ చేరడంతో 66 రన్స్కే 4 కీలక వికెట్లు కోల్పోయిన ఇండియా కష్టాల్లో పడింది. ఆపై విరాట్ కోహ్లీ(44)తో కలిసి రవీంద్ర జడేజా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఐదో వికెట్కు 59 రన్స్ పార్ట్నర్షిప్ నమోదు చేశాక జడేజాను మర్ఫీ ఔట్ చేశాడు. కాసేపటికే కోహ్లీ, భరత్ (6) ఔట్ అవడంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
139 రన్స్కే 7 వికెట్లు కోల్పోయిన తరుణంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (115 బంతుల్లో 74) , రవి అశ్విన్ (71 బంతుల్లో 37) జట్టును ఆదుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. అశ్విన్ నెమ్మదిగా సపోర్ట్ ఇవ్వగా.. అక్షర్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోర్బోర్డును కదిలించాడు. ఏడో వికెట్కు 114 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశాక వరుస ఓవర్లలో అశ్విన్, అక్షర్ పెవిలియన్ చేరారు. అశ్విన్ను కమిన్స్ ఔట్ చేయగా.. అక్షర్ను మర్ఫీ బోల్తా కొట్టించాడు. అప్పటికే భారత్ స్కోరు 259. ఆసీస్ కంటే మరో 4 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది. కాసేపటికే షమీ (2) కూడా వెనుదిరగడంతో 262 రన్స్ వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. దీంతో ఆసీస్కు ఒక రన్ లీడ్ లభించింది. కంగారూ బౌలర్లలో లియోన్ 5 వికెట్లతో సత్తాచాటగా.. మర్ఫీ, కునేమన్ చెరో రెండు వికెట్లు, కమిన్స్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
Also Read: Virendra Sehwag: ధోనీ కాదు.. ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్ రోహిత్: సెహ్వాగ్
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!