Rathnam : రక్తపాతంతో హరి మార్క్ ‘రత్నం’.. ట్రైలర్ అదిరింది పో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ్ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రత్నం’ ఈ సినిమాకు సింగం సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తున్నాడు.. గతంలో వీరిద్దరి కాంబోలో భరణి, పూజ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి.. ఇప్పుడు రాబోయే రత్నం మూవీపై కూడా భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీని స్టోన్బెంచ్ ఫిల్మ్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.. రీసెంట్గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు…ఫస్ట్ లుక్ లో విశాల్ పక్కా మాస్ మాస్ అవతారంలో కనిపించి ఆకట్టుకుంటున్నాడు.
ఇక ఈ సినిమాను తెలుగు మరియు తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు.తాజాగా విడుదల చేసిన ట్రైలర్ అదిరిపోయింది.ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు బోర్డర్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమాను తెరకెక్కించగా.. ఈ మూవీ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగింది. ఈ మూవీలో సముద్రఖని, యోగిబాబు మరియు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. విశాల్ గతంలో నటించిన యాక్షన్ చిత్రాలకు పూర్తి భిన్నంగా రత్నం మూవీ తెరకెక్కినట్లు సమాచారం..యాక్షన్ చిత్రాలకు పేరు గాంచిన దర్శకుడు హరి ఈ చిత్రాన్ని తనదైన శైలిలో మరింత ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలిపారు..
Also Read
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Tags
- Hari
- Rathnam
- trailer release
- Vishal
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..