హన్సిక హీరోయిన్గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ మై నేమ్ ఈజ్ శృతి..నవంబర్ 17న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. అదే రోజు పోటీగా పలు సినిమాలు విడుదల కావడంతో మై నేమ్ ఈజ్ శృతి కలెక్షన్స్పై ఎఫెక్ట్ చూపించింది. ఆశించిన స్థాయిలో వసూళ్లను అయితే రాబట్టలేకపోయింది.. సందీప్కిషన్ హీరోగా 2019లో రూపొందిన తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ తర్వాత టాలీవుడ్కు గ్యాప్ ఇచ్చిన హన్సిక. మై నేమ్ ఈజ్ శృతి మూవీతోనే దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత తిరిగి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.మై నేమ్ ఈజ్ శృతి మూవీతో శ్రీనివాస్ ఓంకార్ డైరెక్టర్గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్కిన్ మాఫియా అనే కొత్త పాయింట్తో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు.ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ స్ట్రీమంగ్ అవుతోంది.తాజాగా ఆహా ఓటీటీలోకి కూడా హన్సిక మూవీ రాబోతోంది.
మై నేమ్ ఈజ్ శృతి ఓటీటీ రిలీజ్ డేట్ను ఆహా అఫీషియల్గా అనౌన్స్చేసింది.బుధవారం (ఫిబ్రవరి 28) నుంచి ఈ మూవీ ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో హన్సిక యాక్టింగ్తో పాటు కాన్సెప్ట్ కూడా బాగుందనే పేరొచ్చిన కమర్షియల్గా మాత్రం సినిమా వర్కవుట్ కాలేదు.మై నేమ్ ఈజ్ శృతి సినిమాలో మురళీశర్మ, నరేన్, పూజా రామచంద్రన్ మరియు ప్రవీణ్ కీలక పాత్రలు పోషించారు.మై నేమ్ ఈజ్ శృతి తర్వాత తెలుగులో 105 మినిట్స్ పేరుతో హన్సిక ఓ సినిమా చేసింది. సింగిల్ క్యారెక్టర్తో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఆ మూవీ కూడా హన్సికకు నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం తమిళంలో రౌడీ బేబీ మరియు గార్డియన్తో పాటు మ్యాన్ అనే సినిమాలో నటిస్తుంది.2022 డిసెంబర్లో తన చిరకాల ప్రియుడు సోహైల్ కథురియాను పెళ్లిచేసుకుంది.. రాజస్థాన్లోని జైపూర్లో ఈ జంట పెళ్లి వేడుక జరిగింది. హన్సిక తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తుంది.