Site icon NTV Telugu

India vs Pakistan: ‘హ్యాండ్ షేక్’పై సూర్య సంచలన ప్రకటన.. పాక్ కండీషన్.. భారత్ ఒప్పుకుంటుందా?

India Vs Pakistan

India Vs Pakistan

India vs Pakistan: భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మరికొన్ని గంటల్లో మొదలవుతుంది. శ్రీలంకలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ మ్యాచ్ కోసం క్రీడా ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే అనేక వివాదాల మధ్య ఈ మ్యాచ్ ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పుడు మరో కొత్త వివాదం మొదలయ్యే అవకాశం ఉంది. మైదానంలో ఆట ఎంత ఉత్కంఠగా ఉంటుందో అనేది ఓ వైపు అయితే.. మ్యాచ్ ముందు లేదా ముగిసిన తర్వాత ఆటగాళ్లు చేతులు కలుపుతారా? లేదా? అనే అంశంపై ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

READ MORE: Mahashivratri 2026: ‘మహాశివరాత్రి’ వ్రత మహిమ.. ఉపవాసం, జాగరణ తప్పక ఉండాల్సిందేనా?

మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఈ అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. ఆఘా “భారత్ ఏం చేస్తే దాని మీదే నిర్ణయం ఉంటుంది” అన్నాడు. సూర్యకుమార్ మాత్రం “24 గంటలు ఆగండి.. మైదానంలో ఏమవుతుందో చూస్తారు” అని నవ్వుతూ తప్పించుకున్నాడు. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. గతేడాది ఆసియా కప్‌లో రెండు జట్లు మూడు సార్లు ఎదురుపడ్డప్పుడు వాతావరణం చాలా టెన్షన్‌గా మారింది. ఆటగాళ్ల మధ్య మాటల ఏకంగా యుద్ధ వాతావరణం కొనసాగింది. మ్యాచ్ తర్వాత, ముందు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. కొందరు ఆటగాళ్లు ప్రేరేపించేలా సంకేతాలు సైతం చేశారు. ఆ సంఘటనల ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. పహల్గాం దాడి అనంతరం పాకిస్థాన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని భారత్ ఫిక్స్ అయ్యింది. అయితే.. ఇటీవల తామే భారత్‌తో మ్యాచ్ ఆడమని మొండిగా ప్రవర్తించిన పాకిస్థాన్‌ ఐసీసీ భేటీ అనంతరం ఆడేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇందుకు గాను పాక్ కండీషన్లు పెట్టింది. ఈ కండీషన్లలో భారత్ టీమ్ షేక్ హ్యాండ్ ఇవ్వాలనేది ప్రధానంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇంతకీ భారత్ షేక్ హ్యాండ్ ఇస్తుందా? లేదా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

READ MORE: Shivaratri Upavasam: నేడే మహా శివరాత్రి.. ఉపవాసం ఇలా చేస్తే.. మీకు ఆ శివయ్య అనుగ్రహం లభిస్తుంది..

Exit mobile version