Haldwani Violence: హల్ద్వానీలో తాత్కాలికంగా కర్ఫ్యూ సడలింపు..

Haldwani

Haldwani

Curfew relaxed: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో నైనిటాల్ జిల్లాలోని బన్‌భూల్‌పురా పట్టణంలో ‘అక్రమ’ మదర్సా కూల్చివేతపై హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో విధించిన కర్ఫ్యూ తాత్కాలిక సడలించింది. గౌజాజలి, రైల్వే బజార్, ఎఫ్‌సిఐ గోడౌన్‌తో సహా కొన్ని ప్రాంతాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుందని జిల్లా మేజిస్ట్రేట్ వందనా సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన బన్‌భూల్‌పురాలో కర్ఫ్యూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రెండు గంటల పాటు సడలించబడుతుంది అని పేర్కొన్నారు.

Read Also: Yash : అసిస్టెంట్ ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చిన యష్.. ఫోటోలు వైరల్..

×
×
Ad

అయితే, ఫిబ్రవరి 8న మదర్సా కూల్చివేత తర్వాత స్థానికులు మున్సిపల్ కార్మికులతో పాటు పోలీసులపై రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడి చేయడంతో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. మరో గుంపు ఒక పోలీసు స్టేషన్‌కు నిప్పంటించడంతో గందరగోళానికి కారణమైంది. ఈ దాడుల్లో ఆరుగురు మరణించడంతో పాటు పోలీసు సిబ్బంది, జర్నలిస్టులతో సహా వంద మందికి పైగా గాయపడ్డారు. బన్‌భూల్‌పురా అంతటా విధించిన కర్ఫ్యూ ఇప్పటికే పట్టణంతో పాటు ఇతర ప్రాంతాలలో ఎత్తివేయబడింది.