Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదు వీడియో గ్రఫీ సర్వేపై స్టే ఇవ్వాలని కోరుతూ అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. మరోవైపు స్టే విధించాలని వేసిన పిటిషన్ కు వ్యతిరేఖంగా హిందూ సేన మరో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలను జారీ చేసింది.
వారణాసి కోర్ట్ లో మొదటి ట్రయల్ పూర్తయ్యే వరకు వేచి చూద్దాం అని సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించింది. శివలింగం దొరికిన ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ ను ఆదేశించింది. ఇదే విధంగా ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది సుప్రీం కోర్ట్. అన్ని వర్గాలు సమతుల్యతను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది. కాగా స్టే విధించాలని అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ దాఖలు చేసిన పిటిషన్ కు వ్యతిరేఖంగా పిటిషన్ వేసి హిందూ పిటిషనర్లకు, యూపీ ప్రభుత్వానికి సుప్రిీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది. మే 19 లోగా రెస్పాండ్ కావాలని ఆదేశించింది.
Also Read
- Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
ఇదిలా ఉంటే వారణాసి కోర్ట్ జ్ఞానవాపి సర్వేపై విచారణ చేసింది. సర్వే రిపోర్ట్ సమర్పించడానికి రెండ్రోజుల గడువు ఇచ్చింది కోర్ట్. సర్వే రిపోర్ట్ పూర్తి కాకుండా వివరాలను బయట పెట్టినందుకు సర్వే కమిషనర్ అజయ్ మివ్రాను తొలగించింది కోర్ట్. అజయ్ మిశ్రా సన్నిహితులు మీడియాకు రిపోర్ట్ లీక్ చేసినట్లు గుర్తించింది కోర్ట్. కాగా ఈనెల 14-16 వరకు జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వేకు వారణాసి కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. మే 17న రిపోర్ట్ కోర్ట్ ముందుంచాలని ఆదేశించింది. అయితే మసీదులోని వజుఖానాలో శివలింగం బయటపడిందనే వార్తలు రాగానే… కోర్ట్ కమినర్లు రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి మరికొంత గడువును కోరారు. మరోవైపు ప్రస్తుత వ్యవహారాలపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అత్యవసరంగా సమావేశం అయింది. జ్ఞానవాపి మసీదు, జామియా మసీదు వంటి అంశాలపై చర్చించి.. కార్యచరణ రూపొందించనున్నట్లు తెలిసింది.
తాజావార్తలు
-
Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
-
PV Sindhu: విరాట్ కోహ్లీ చెప్పిన ఒక్క మాటే.. నా జీవితాన్ని పూర్తిగా మార్చింది!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Botsa Satyanarayana: పంచదార్లలో వైసీపీ నేత బొత్స సంచలన వ్యాఖ్యలు.. సర్కార్ పై తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?