Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదు వీడియో గ్రఫీ సర్వేపై స్టే ఇవ్వాలని కోరుతూ అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. మరోవైపు స్టే విధించాలని వేసిన పిటిషన్ కు వ్యతిరేఖంగా హిందూ సేన మరో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలను జారీ చేసింది.
వారణాసి కోర్ట్ లో మొదటి ట్రయల్ పూర్తయ్యే వరకు వేచి చూద్దాం అని సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించింది. శివలింగం దొరికిన ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ ను ఆదేశించింది. ఇదే విధంగా ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది సుప్రీం కోర్ట్. అన్ని వర్గాలు సమతుల్యతను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది. కాగా స్టే విధించాలని అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ దాఖలు చేసిన పిటిషన్ కు వ్యతిరేఖంగా పిటిషన్ వేసి హిందూ పిటిషనర్లకు, యూపీ ప్రభుత్వానికి సుప్రిీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది. మే 19 లోగా రెస్పాండ్ కావాలని ఆదేశించింది.
Also Read
- Iran Oil: భారత్పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
- Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
- Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
ఇదిలా ఉంటే వారణాసి కోర్ట్ జ్ఞానవాపి సర్వేపై విచారణ చేసింది. సర్వే రిపోర్ట్ సమర్పించడానికి రెండ్రోజుల గడువు ఇచ్చింది కోర్ట్. సర్వే రిపోర్ట్ పూర్తి కాకుండా వివరాలను బయట పెట్టినందుకు సర్వే కమిషనర్ అజయ్ మివ్రాను తొలగించింది కోర్ట్. అజయ్ మిశ్రా సన్నిహితులు మీడియాకు రిపోర్ట్ లీక్ చేసినట్లు గుర్తించింది కోర్ట్. కాగా ఈనెల 14-16 వరకు జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వేకు వారణాసి కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. మే 17న రిపోర్ట్ కోర్ట్ ముందుంచాలని ఆదేశించింది. అయితే మసీదులోని వజుఖానాలో శివలింగం బయటపడిందనే వార్తలు రాగానే… కోర్ట్ కమినర్లు రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి మరికొంత గడువును కోరారు. మరోవైపు ప్రస్తుత వ్యవహారాలపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అత్యవసరంగా సమావేశం అయింది. జ్ఞానవాపి మసీదు, జామియా మసీదు వంటి అంశాలపై చర్చించి.. కార్యచరణ రూపొందించనున్నట్లు తెలిసింది.
తాజావార్తలు
-
Iran Oil: భారత్పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
-
Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
-
Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
-
Sanjeev Bikhchandani: ఒక్క నిర్ణయం.. వేల కోట్ల సామ్రాజ్యం! నౌక్రీ.కామ్ బాస్ ఇన్వెస్ట్మెంట్ మ్యాజిక్ చూశారా?
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?