Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు
దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జ్ఞానవాపి మసీదు వీడియో గ్రఫీ సర్వేపై స్టే ఇవ్వాలని కోరుతూ అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. మరోవైపు స్టే విధించాలని వేసిన పిటిషన్ కు వ్యతిరేఖంగా హిందూ సేన మరో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలను జారీ చేసింది.
వారణాసి కోర్ట్ లో మొదటి ట్రయల్ పూర్తయ్యే వరకు వేచి చూద్దాం అని సుప్రీం కోర్ట్ వ్యాఖ్యానించింది. శివలింగం దొరికిన ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ ను ఆదేశించింది. ఇదే విధంగా ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది సుప్రీం కోర్ట్. అన్ని వర్గాలు సమతుల్యతను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది. కాగా స్టే విధించాలని అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ దాఖలు చేసిన పిటిషన్ కు వ్యతిరేఖంగా పిటిషన్ వేసి హిందూ పిటిషనర్లకు, యూపీ ప్రభుత్వానికి సుప్రిీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది. మే 19 లోగా రెస్పాండ్ కావాలని ఆదేశించింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
ఇదిలా ఉంటే వారణాసి కోర్ట్ జ్ఞానవాపి సర్వేపై విచారణ చేసింది. సర్వే రిపోర్ట్ సమర్పించడానికి రెండ్రోజుల గడువు ఇచ్చింది కోర్ట్. సర్వే రిపోర్ట్ పూర్తి కాకుండా వివరాలను బయట పెట్టినందుకు సర్వే కమిషనర్ అజయ్ మివ్రాను తొలగించింది కోర్ట్. అజయ్ మిశ్రా సన్నిహితులు మీడియాకు రిపోర్ట్ లీక్ చేసినట్లు గుర్తించింది కోర్ట్. కాగా ఈనెల 14-16 వరకు జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వేకు వారణాసి కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. మే 17న రిపోర్ట్ కోర్ట్ ముందుంచాలని ఆదేశించింది. అయితే మసీదులోని వజుఖానాలో శివలింగం బయటపడిందనే వార్తలు రాగానే… కోర్ట్ కమినర్లు రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి మరికొంత గడువును కోరారు. మరోవైపు ప్రస్తుత వ్యవహారాలపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అత్యవసరంగా సమావేశం అయింది. జ్ఞానవాపి మసీదు, జామియా మసీదు వంటి అంశాలపై చర్చించి.. కార్యచరణ రూపొందించనున్నట్లు తెలిసింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!