NTV Telugu Site icon

Guntur Kaaram: ఓటీటీలోకి వచ్చేసిన ‘గుంటూరు కారం’.. ఎక్కడ చూడొచ్చంటే?

Guntur Karam

Guntur Karam

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కూడా ఉంది.. ప్రీమియర్ షోలతో ముందుగా మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ .. ఆ తర్వాత మాత్రం మంచి విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా ఇప్పటివరకు బాగానే కలెక్షన్స్ ను రాబట్టినట్లు తెలుస్తుంది.. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‏ గత నెల జనవరి 12న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జయరామ్ వంటి ప్రముఖ నటులు ప్రత్యేక పాత్రల్లో నటించారు..

అమ్మ సెంటిమెంట్ తో సినిమాను తెరాకెక్కించారు.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది.. పాటల గురించి చెప్పక్కర్లేదు. తమన్ అందించిన మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంది. ఈ మూవీలోని ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తి ఎదురుచూశారు. ఇక ఇప్పుడు ప్రేక్షకులకు ఎదురుచూపులకు తెర పడింది.. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది..

నిన్న అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఈ మూవీ అందుబాటులో ఉంది.. అయితే థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాలి. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వచ్చిన మూడవ చిత్రం ఇదే. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు..