GST Rule Change: వచ్చే నెలనుంచి మారనన్న జీఎస్టీ రూల్.. వ్యాపారులకు తిప్పలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST Rule Change: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో వచ్చే నెల నుంచి లావాదేవీలకు సంబంధించిన నియమాలలో మార్పులు చేయబడ్డాయి. పన్ను చట్టాలను ప్రభావవంతంగా చేయడానికి, సమ్మతిని సులభతరం చేయడానికి, చివరికి పన్ను ఎగవేతను నిరోధించడానికి జీఎస్టీలో కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి. జీఎస్టీ నెట్వర్క్ ఈ మేరకు సమాచారం ఇచ్చింది. కొత్త నిబంధనను మే 1, 2023 నుండి వ్యాపారవేత్తలు తప్పనిసరిగా అనుసరించాల్సిన అవసరం ఉంది. మే 1 నుండి ఏదైనా లావాదేవీకి సంబంధించిన రసీదును 7 రోజుల్లోగా ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (IRP)లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
Read Also: Prakash Ambedkar : దేశంలో కొత్త నడవడికను సీఎం కేసీఆర్ మొదలుపెట్టారు
Also Read
- Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- Astrology: జూలై 23 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!
GSTN ప్రకారం.. మే 1 నుండి 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారవేత్తలందరూ ఈ నియమాన్ని పాటించాలి. కొత్త నిబంధన ప్రకారం, 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలు పాత ఇన్వాయిస్లను అప్లోడ్ చేయలేరు. అందుకు కొంత సమయం విధించబడుతుంది. IRPలో ఇన్వాయిస్ అప్లోడ్ చేయకపోతే వ్యాపారులు దానిపై ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) ప్రయోజనాన్ని పొందలేరు అని GST నియమాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కంపెనీలు తమ ఇ-ఇన్వాయిస్లను ఎప్పుడైనా అప్లోడ్ చేయవచ్చు.. కానీ కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ సమయం కేవలం 7 రోజులు మాత్రమే ఉంటుంది.
Read Also:Chewing Gum : ఏడాదికి లక్ష టన్నుల చూయింగ్ గమ్ నమిలేస్తున్నారా ?
జీఎస్టీ వసూళ్లను పెంచేందుకు కొత్త రూల్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు . దీనితో పాటు కంపెనీలు సమయానికి ITC యొక్క ప్రయోజనాన్ని కూడా పొందుతాయి. డిజిటలైజేషన్ ప్రక్రియను బలోపేతం చేయడమే దీని ఉద్దేశం. ఇటీవల, 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలు లేదా కంపెనీలు ప్రతి లావాదేవీకి GST ఇన్వాయిస్ను రూపొందించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ ప్రక్రియ నిదానంగా అమలవుతుందని.. త్వరలో వ్యాపారులందరికీ దీన్ని తప్పనిసరి చేస్తామని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం, 10 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు అన్ని B2B లావాదేవీలకు ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్లను రూపొందించడం తప్పనిసరి చేయబడింది. ప్రభుత్వం అక్టోబర్ 1, 2022 నుండి ఈ నియమాన్ని అమలు చేసింది. ఇప్పుడు IRPలో ఇ-ఇన్వాయిస్లను సకాలంలో అప్లోడ్ చేయడం ద్వారా ప్రభుత్వం, కంపెనీలు రెండూ ప్రయోజనం పొందుతాయి. ఒకవైపు, ఇది GST వసూళ్లను పెంచడంలో సహాయపడుతుంది. మరోవైపు వ్యాపారులు ITC ప్రయోజనాన్ని త్వరగా పొందగలుగుతారు.
తాజావార్తలు
-
Epic Movie Release Date: విజయ్ దేవరకొండ స్లాట్లో ఆనంద్ దేవరకొండ? ‘ఎపిక్’ విడుదలపై ఆసక్తికర ప్రచారం
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
-
Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
-
Samsung Galaxy Z Fold 8: 50MP కెమెరా, 4800mAh బ్యాటరీతో.. సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 విడుదల
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!