GST Rule Change: వచ్చే నెలనుంచి మారనన్న జీఎస్టీ రూల్.. వ్యాపారులకు తిప్పలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST Rule Change: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో వచ్చే నెల నుంచి లావాదేవీలకు సంబంధించిన నియమాలలో మార్పులు చేయబడ్డాయి. పన్ను చట్టాలను ప్రభావవంతంగా చేయడానికి, సమ్మతిని సులభతరం చేయడానికి, చివరికి పన్ను ఎగవేతను నిరోధించడానికి జీఎస్టీలో కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి. జీఎస్టీ నెట్వర్క్ ఈ మేరకు సమాచారం ఇచ్చింది. కొత్త నిబంధనను మే 1, 2023 నుండి వ్యాపారవేత్తలు తప్పనిసరిగా అనుసరించాల్సిన అవసరం ఉంది. మే 1 నుండి ఏదైనా లావాదేవీకి సంబంధించిన రసీదును 7 రోజుల్లోగా ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (IRP)లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
Read Also: Prakash Ambedkar : దేశంలో కొత్త నడవడికను సీఎం కేసీఆర్ మొదలుపెట్టారు
Also Read
- Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
- Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
GSTN ప్రకారం.. మే 1 నుండి 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారవేత్తలందరూ ఈ నియమాన్ని పాటించాలి. కొత్త నిబంధన ప్రకారం, 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలు పాత ఇన్వాయిస్లను అప్లోడ్ చేయలేరు. అందుకు కొంత సమయం విధించబడుతుంది. IRPలో ఇన్వాయిస్ అప్లోడ్ చేయకపోతే వ్యాపారులు దానిపై ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) ప్రయోజనాన్ని పొందలేరు అని GST నియమాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కంపెనీలు తమ ఇ-ఇన్వాయిస్లను ఎప్పుడైనా అప్లోడ్ చేయవచ్చు.. కానీ కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ సమయం కేవలం 7 రోజులు మాత్రమే ఉంటుంది.
Read Also:Chewing Gum : ఏడాదికి లక్ష టన్నుల చూయింగ్ గమ్ నమిలేస్తున్నారా ?
జీఎస్టీ వసూళ్లను పెంచేందుకు కొత్త రూల్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు . దీనితో పాటు కంపెనీలు సమయానికి ITC యొక్క ప్రయోజనాన్ని కూడా పొందుతాయి. డిజిటలైజేషన్ ప్రక్రియను బలోపేతం చేయడమే దీని ఉద్దేశం. ఇటీవల, 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలు లేదా కంపెనీలు ప్రతి లావాదేవీకి GST ఇన్వాయిస్ను రూపొందించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ ప్రక్రియ నిదానంగా అమలవుతుందని.. త్వరలో వ్యాపారులందరికీ దీన్ని తప్పనిసరి చేస్తామని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం, 10 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు అన్ని B2B లావాదేవీలకు ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్లను రూపొందించడం తప్పనిసరి చేయబడింది. ప్రభుత్వం అక్టోబర్ 1, 2022 నుండి ఈ నియమాన్ని అమలు చేసింది. ఇప్పుడు IRPలో ఇ-ఇన్వాయిస్లను సకాలంలో అప్లోడ్ చేయడం ద్వారా ప్రభుత్వం, కంపెనీలు రెండూ ప్రయోజనం పొందుతాయి. ఒకవైపు, ఇది GST వసూళ్లను పెంచడంలో సహాయపడుతుంది. మరోవైపు వ్యాపారులు ITC ప్రయోజనాన్ని త్వరగా పొందగలుగుతారు.
తాజావార్తలు
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ను ఫిక్స్ ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!