Site icon NTV Telugu

Stock Market: జెరోధాను ఓడించిన గ్రో.. క్రియాశీల పెట్టుబడిదారులలో నంబర్ వన్ బ్రోకరేజ్ కంపెనీ

New Project (8)

New Project (8)

Stock Market: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు చేర్చుకోవడంలో బ్రోకరేజీ సంస్థల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెరోధా(Zerodha)ను వెనక్కి నెట్టి క్రియాశీల పెట్టుబడిదారుల పరంగా గ్రో(Groww ) అతిపెద్ద బ్రోకరేజ్ కంపెనీగా అవతరించింది. అంటే ఫిన్‌టెక్ స్టార్టప్ గ్రో ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో క్రియాశీల పెట్టుబడిదారులను కలిగి ఉంది. NSE ప్రకారం.. Groww 6.63 మిలియన్ల క్రియాశీల పెట్టుబడిదారులను కలిగి ఉండగా, Zerodhaలో మొత్తం 6.48 మిలియన్ల క్రియాశీల పెట్టుబడిదారులు ఉన్నారు.

మార్చి 2021లో Zerodha 3.4 మిలియన్ కస్టమర్‌లను కలిగి ఉండగా, Growwకి 0.78 మిలియన్ కస్టమర్‌లు ఉన్నారు. అప్పటి నుంచి జెరోధా రెండింతల వృద్ధిని నమోదు చేసింది. గత రెండేళ్లలో Groww వినియోగదారులలో రికార్డు పెరుగుదల కనిపించింది. ఇది 750 శాతం పెరుగుదల. 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశంలోని మొట్టమొదటి, అతిపెద్ద డిస్కౌంట్ బ్రోకర్ కంపెనీ Zerodha 6.39 మిలియన్ల కస్టమర్‌లను జోడించగా, Grow 5.37 మిలియన్ కస్టమర్‌లను కలిగి ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో 0.78 మిలియన్ల వినియోగదారుల నుండి 2022 ఆర్థిక సంవత్సరంలో 3.85 మిలియన్లకు, 2023 ఆర్థిక సంవత్సరంలో 5.78 మిలియన్ల పెట్టుబడిదారులకు వృద్ధి పెరిగింది. ఇది కాకుండా మరికొన్ని బ్రోకరేజ్ కంపెనీలు మంచి వృద్ధిని సాధించాయి.

Read Also:Leo Ram Charan Cameo: రీచ్ కోసం ఎంతకీ తెగించారు మావా… చరణ్ ‘కోబ్రా’ అంట…

ఈ బ్రోకరేజ్ కంపెనీలు ఎందుకు ప్రసిద్ధి చెందాయి?
Groww, Upstox వారి ప్లాట్‌ఫారమ్‌లకు వేగంగా వినియోగదారులను జోడించాయి. ఈ కంపెనీలు ఖాతా తెరవడం, నిర్వహణ కోసం కస్టమర్ నుండి ఎలాంటి రుసుం వసూలు చేయవు. దీని కారణంగా వారు మరింత ప్రజాదరణ పొందారు. PhonePeకి 200 మిలియన్ల చెల్లింపు కస్టమర్లు ఉన్నారు. స్టాక్ మార్కెట్‌లోకి బ్రోకరేజ్‌గా కూడా ప్రవేశించింది.

జీరోధా ఆదాయం గ్రో కంటే ఐదు రెట్లు ఎక్కువ
సెప్టెంబర్ నెలాఖరు నాటికి డీమ్యాట్ ఖాతాల సంఖ్య 12.97 కోట్లు. NSE డేటా ప్రకారం, 3.34 కోట్ల మంది భారతీయులు కనీసం సంవత్సరానికి ఒకసారి వ్యాపారం చేస్తారు. గ్రో కంటే ఐదు రెట్లు ఎక్కువ జీరోధా వసూళ్లు రావడం గమనార్హం. 2023 ఆర్థిక సంవత్సరంలో, జీరోధా గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,907 కోట్లుగా ఉన్న గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 39 శాతం పెరిగి రూ.6,875 కోట్లకు చేరుకుంది.

Read Also:Angallu Rioting Case: చంద్రబాబుకు భారీ ఊరట.. ఆ కేసులో బెయిల్‌

Exit mobile version