MP Joginapally Santosh Kumar : ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ భావితరాలకు స్ఫూర్తిదాయకం : ఆక్టివిస్ట్ డా.సతీష్ శిఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Joginapally Santosh Kumar : ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమం భావితరాలకు స్ఫూర్తిదాయకం అని గ్లోబల్వార్మింగ్యాక్టివిస్ట్డాక్టర్సతీష్శిఖ బీఆర్ఎస్ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ను అభినందించారు. సతీష్ శిఖ ఈ రోజు ప్రగతి భవన్ లో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ అధినేత సంతోష్ కుమార్ను కలిశారు. డాక్టర్ సతీష్ శిఖ ఓ ఫ్యాషన్ డిజైనర్. 2007లో తన వృత్తిని వదిలి గ్లోబల్ వార్మింగ్ ఆక్టివిస్ట్ గా మారారు. భారత్ లో పుట్టిన కెనాడా ఎన్నారై అయిన డాక్టర్ సతీష్ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషిగాను మంగోలియా దేశంలోని ఎకో ఏషియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. భారత దేశమంతటా నిరుపేద పిల్లలకు మద్ధతు ఇవ్వడానికి ‘90 మిలియన్ స్మైల్స్ ఫౌండేషన్’ అనే సంస్థను స్థాపించాడు. ఇతను 2007 లో ఒక కిలోమీటర్ పొడవునా ‘ఎకో గ్రీన్ హ్యాండ్ మేడ్ సిల్క్ క్లాత్ ఫ్యాబ్రిక్’ ని నిర్మించారు. ఈ సిల్క్ క్లాత్ పై పర్యావరణానికి మద్దతుగా అనేక మందికి సందేశాలను అందించారు. 72 దేశాల నుండి సుమారు 1,263 మంది ప్రముఖులు, పర్యావరణ కార్యకర్తల సందేశాలతో సిల్క్ క్లాత్ 1.2 కి.మీ. కంటే ఎక్కువ పొడవుగా మారింది.
Read Also: Building Collapsed : కూకట్ పల్లి బిల్డింగ్ కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతి
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ద్వారా పర్యావరణానికి చేస్తున్న విశేష కృషిని గుర్తించి సిల్క్ ఫ్యాబ్రిక్ పై తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా డాక్టర్ సతీష్ శిఖ అభ్యర్థించారు. పర్యావరణ పరిరక్షణకు తగిన చొరవ చూపుతున్న డాక్టర్ సతీష్ శిఖ కార్యక్రమానికి ముగ్ధుడైన సంతోష్ కుమార్ అతని అభ్యర్థనను గౌరవిస్తూ.. ‘‘మొక్కలను నాటండి, రక్షించండి, ప్రోత్సహించండి. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ దేశాన్ని తద్వారా భూగోళాన్ని రక్షించండి’’ అంటూ సిల్క్ ఫ్యాబ్రిక్ (పట్టు వస్త్రం)పై తన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ రాగి నాణేన్ని ఎంపీ సంతోష్ కుమార్ కు బహుమతిగా ఇచ్చారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను డాక్టర్ సతీష్ శిఖ ప్రశంసిస్తూ వాటిని నిరంతరంగా కొనసాగించాలని ఎంపీని అభ్యర్థించారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!