Samesh Jung: మను భాకర్-సరబ్జోత్ సింగ్ కోచ్ ఇంటిని కూల్చేయనున్న ప్రభుత్వం..!
- ఒలింపిక్ పతక విజేతలు మను భాకర్.. సరబ్జోత్ సింగ్ కోచ్ సమరేష్ జంగ్
- శుక్రవారం పారిస్ ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చిన జంగ్
- తన ఇంటిని కూల్చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం నోటీసులు
- రెండ్రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశం
- రెండ్రోజుల్లో ఎలా ఖాళీ చేస్తామని కోచ్ ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒలింపిక్ పతక విజేతలు మను భాకర్, సరబ్జోత్ సింగ్ కోచ్ సమరేష్ జంగ్ శుక్రవారం పారిస్ ఒలింపిక్స్ నుంచి తిరిగి వచ్చారు. ఆయన రాగానే అతడి ఇంటిని కూల్చివేస్తున్నట్లు నోటీసులు అందాయి. అర్జున అవార్డు గ్రహీత జంగ్ ఇల్లు ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతం.. ఖైబర్ పాస్ ఏరియాలో ఉంది. ఆయనకే కాకుండా ఆ కాలనీ వాసులందరికీ నోటీసులు అందాయి. హౌసింగ్ మంత్రిత్వ శాఖ యొక్క అనుబంధ సంస్థ అయిన ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ (LNDO) నివాసితులకు నోటీసు జారీ చేసింది.
READ MORE: SR Nagar Hostel: ఎస్ ఆర్ నగర్ లో హాస్టల్ లో డ్రగ్స్ కలకలం..
Also Read
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ఖైబర్ పాస్ ప్రాంతంలో నిర్మించిన ఇళ్లు, ఇతర నిర్మాణాలు అక్రమంగా నిర్మించబడ్డాయని ఎల్డీఎన్ఓ తెలిపింది. మీడియాతో మాట్లాడిన సమరేష్ జంగ్, “దాని గురించి నాకు పూర్తిగా తెలియదు. వారు మొత్తం కాలనీని అక్రమంగా ప్రకటించారు. కూల్చివేత కార్యక్రమం గురించి ప్రాంత వాసులకు గత రాత్రి సమాచారం అందించారు. ఇప్పుడు వారు మొత్తం కాలనీని ఖాళీ చేయడానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. మా కుటుంబం 1950 నుంచి గత 75 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తోంది. మేము కోర్టుకు వెళ్లాము. కానీ పిటిషన్ తిరస్కరించబడింది.” అని వ్యాఖ్యానించారు.
READ MORE:Janhvi Kapoor: జీవితంలో ఆ పని అస్సలు చేయొద్దంది.. జాన్వీ సంచలన వ్యాఖ్యలు
కేవలం రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయని జంగ్ తెలిపారు. “కూల్చివేత డ్రైవ్ను నిర్వహించాలని అనుకుంటున్నారు.. కానీ ఇది దానికి సరైన పద్ధతిలో నిర్వహించాలి. ప్రజలకు సమయం ఇవ్వాలి. ఒక వ్యక్తి తన ఇంటిని ఒక్క రోజులో ఎలా ఖాళీ చేస్తాడు?’ అని సమరేష్ జంగ్ ప్రశ్నించారు. కాగా.. ఆయన 2006లో మెల్బోర్న్ కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఐదు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!