Supreme Court: గవర్నర్ రాష్ట్రానికి నామమాత్రపు అధిపతి.. బిల్లులను పెండింగ్లో ఉంచలేరు: సుప్రీం కోర్టు
Supreme Court: ‘ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు నిజమైన అధికారం ఉంటుంది. వారు రాష్ట్రాలు, కేంద్రంలోని ప్రభుత్వాలలో రాష్ట్ర శాసనసభ, పార్లమెంటు ప్రతినిధులగా ఉంటారు’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. గవర్నర్ రాష్ట్రానికి ఎన్నికైన అధిపతి కాదు, రాష్ట్రపతిచే నియమించబడిన రాష్ట్రానికి నామమాత్రపు అధిపతి. కేబినెట్ రూపంలో ప్రభుత్వ సభ్యులే శాసనసభకు జవాబుదారీగా ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ‘ఎన్నికలేని రాష్ట్రాధిపతిగా గవర్నర్కు కొన్ని రాజ్యాంగపరమైన అధికారాలు మాత్రమే అప్పగించబడ్డాయన్నారు. అయితే ఈ అధికారాలు సాధారణ చట్టాల ప్రక్రియను విఫలం చేయడానికి ఉపయోగించబడవని న్యాయ స్థానం అభిప్రాయపడింది.
Read Also:Suresh Raina: సురేశ్ రైనా మెరుపులు.. హైదరాబాద్ విజయం!
Also Read
బిల్లుకు ఆమోదం పెండింగ్లో పెట్టడం ద్వారా గవర్నర్ శాసనసభను వీటో చేయలేరని, ఒకవేళ ఆమోదం తెలిపేందుకు నిరాకరిస్తే బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. పంజాబ్ ప్రభుత్వ పిటిషన్పై ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని పిటిషన్లో ఆరోపించారు. ఈ కేసులో ధర్మాసనం నవంబర్ 10న తీర్పు వెలువరించింది. అయితే ఇప్పుడు తీర్పు కాపీని అందించారు. రాష్ట్రానికి ఎన్నికకాని అధినేతగా గవర్నర్కు కొన్ని రాజ్యాంగపరమైన అధికారాలు అప్పగించినట్లు తీర్పులో పేర్కొన్నారు. అయితే, అసెంబ్లీ చట్టాలను రూపొందించే సాధారణ ప్రక్రియను నిర్వీర్యం చేయడానికి గవర్నర్ ఈ అధికారాలను ఉపయోగించలేరు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం బిల్లుకు ఆమోదం ఇవ్వకూడదని గవర్నర్ నిర్ణయించినట్లయితే, బిల్లును పునర్విచారణ కోసం శాసనసభకు పంపాల్సి ఉంటుందని తెలిపింది.
Read Also:Koata Bommali PS Twitter Review: థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో సినిమా.. హిట్ కొట్టినట్లేనా?
తాజావార్తలు
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!