Agriculture: కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామీణ పరిశ్రమల కోసం వ్యవసాయ నిధి ఏర్పాటు!
- వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలని అనుకుంటున్నారా?
- గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర సర్కారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agriculture: మీరు గ్రామంలో ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే, మీలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి ఏదైనా స్టార్టప్ పెట్టాలనుకునే వారికీ సహకరించడం కోసం 750 కోట్ల రూపాయలతో ఫండ్ ఏర్పాటు చేస్తోంది. మారుతున్న వ్యవసాయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన పథకాలను ప్రారంభించబోతోంది. ఇందులో కొత్త స్టార్టప్లు, వ్యవసాయ రంగంలో పని చేస్తున్న పారిశ్రామిక వేత్తలకు ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం సహాయం చేయనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయనుంది. ఇందులో అగ్రిసూర్ పేరుతో రైతుల కోసం వ్యవసాయ నిధిని కేంద్ర సర్కారు సృష్టించనుంది. దీనిని ‘అగ్రికల్చర్ ఫండ్ ఫర్ స్టార్టప్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్’గా పిలుస్తారు. తొలిదశలో రూ.750 కోట్ల నిధుల ద్వారా రైతులు తమ వ్యవసాయాన్ని మెరుగుపరిచేందుకు, వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు, స్థిరత్వాన్ని ప్రోత్సహించేందుకు వినియోగిస్తారు.
Read Also: Punjab: పంజాబ్లో ఆయుధ స్మగ్లింగ్ రాకెట్ను ఛేదించిన పోలీసులు..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
గ్రామీణ పరిశ్రమల కోసం వ్యవసాయ నిధిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇది కాకుండా, వ్యవసాయం, సంబంధిత రంగాలలో పనిచేస్తున్న వారికి స్టార్టప్కు సహకారం అందించడం ద్వారా దానిని ముందుకు తీసుకెళ్లేందుకు పూర్తి సన్నాహాలు చేశారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం, ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి ద్వారా వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు, వాటి స్థిరత్వం పెరుగుతాయి. ఇదే జరిగితే వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. రైతులు కూడా నేరుగా దీని ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇటీవల జరిగిన నేషనల్ అగ్రికల్చర్ బోర్డ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) కీలక భేటీలో అధికారులు దీనికి సంబంధించి చర్చలు జరిపారు. నాబార్డు చైర్మన్ షాజీ కేవీ మాట్లాడుతూ.. వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పుడైతే ఉపయోగించుకుంటారో అప్పుడే వ్యవసాయాభివృద్ధిలో మరెన్నో ముందడుగులు వేస్తారన్నారు. ఇది నేరుగా రైతులకే కాకుండా వ్యవసాయ పారిశ్రామికవేత్తలతో పాటు దేశానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!