Leopard in Film City: ముంబై ఫిల్మ్ సిటీలోకి చిరుతలు.. భయంతో పరారైన మరాఠీ టీవీ సీరియల్ బృందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leopard in Film City: ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీ(Goregaon Film City)లో చిరుతపులి బీభత్సం సృష్టించింది. ప్రతీరోజూ షూటింగ్ సెట్స్లో చిరుతలు కనిపిస్తుండడంతో అక్కడి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. షో సెట్పైకి చిరుతపులి రావడంతో మరోసారి గందరగోళం నెలకొంది. నిన్న రాత్రి ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో మరోసారి చిరుతపులి కనిపించింది. ఈసారి మరాఠీ టీవీ సీరియల్ సెట్లో తన బిడ్డతో కనిపించింది. ఆ సమయంలో సెట్స్లో 200 మందికి పైగా ఉన్నారని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ శ్యామ్లాల్ గుప్తా మీడియాకు తెలిపారు. గత 10 రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం నాలుగో సారి అన్నారు.
Read Also:Kadem Project: డేంజర్ జోన్లో కడెం ప్రాజెక్టు.. పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Also Read
- Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
- Noel Tata vs Chandrasekaran: టాటా సన్స్లో బోర్డు వార్.. చంద్రశేఖరన్ పునర్నియామకంపై నోయెల్ టాటా అభ్యంతరం
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
గత కొన్ని రోజులుగా ఇలాంటి వార్తలు నిరంతరం తెరపైకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ‘అజుని’ టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో చిరుతపులి అక్కడికి వచ్చింది. ఆ సమయంలో దాదాపు 300 మంది సెట్లో ఉన్నారు. సెట్లో ఉన్న కుక్కపై కూడా చిరుత దాడి చేసింది. సెట్లో ఉన్న చిరుతపులిని చూసి అక్కడున్న జనం తీవ్ర భయాందోళనకు గురై అక్కడక్కడా పరిగెడుతూ దాక్కోవడానికి ప్రయత్నించారు. జనం సందడి చేయడంతో చిరుత పారిపోయినా ప్రజల్లో భయం నెలకొంది.
Read Also:No-Confidence Motions: నెహ్రూ మొదలు మోడీ వరకు అవిశ్వాస తీర్మానాలు ఇవే..
ఇంతకు ముందు కూడా సురేష్ శ్యామ్లాల్ గుప్తా ఈ విషయాన్ని తాను చాలాసార్లు లేవనెత్తానని, కానీ ఇప్పటివరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పాడు. మహారాష్ట్ర శాసనసభలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం ఫిలిం సిటీ మొత్తం చిరుతపులి భయం నెలకొందని స్పష్టమవుతోంది. అంతకుముందు ముంబైలోని ఫిల్మ్ సిటీలో గుమ్ హై కిసీ కే ప్యార్ మే అనే టీవీ షో సెట్లోకి కొండచిలువ అకస్మాత్తుగా ప్రవేశించింది. నటుడు శక్తి అరోరా సోషల్ మీడియాలో వీడియోను పంచుకోవడం ద్వారా ఈ సమాచారాన్ని అందించారు. మూడు రోజుల క్రితం తన షో సెట్పైకి చిరుతపులి కూడా వచ్చిందని చెప్పాడు.
తాజావార్తలు
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!