Leopard in Film City: ముంబై ఫిల్మ్ సిటీలోకి చిరుతలు.. భయంతో పరారైన మరాఠీ టీవీ సీరియల్ బృందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leopard in Film City: ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీ(Goregaon Film City)లో చిరుతపులి బీభత్సం సృష్టించింది. ప్రతీరోజూ షూటింగ్ సెట్స్లో చిరుతలు కనిపిస్తుండడంతో అక్కడి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. షో సెట్పైకి చిరుతపులి రావడంతో మరోసారి గందరగోళం నెలకొంది. నిన్న రాత్రి ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో మరోసారి చిరుతపులి కనిపించింది. ఈసారి మరాఠీ టీవీ సీరియల్ సెట్లో తన బిడ్డతో కనిపించింది. ఆ సమయంలో సెట్స్లో 200 మందికి పైగా ఉన్నారని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ శ్యామ్లాల్ గుప్తా మీడియాకు తెలిపారు. గత 10 రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం నాలుగో సారి అన్నారు.
Read Also:Kadem Project: డేంజర్ జోన్లో కడెం ప్రాజెక్టు.. పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
గత కొన్ని రోజులుగా ఇలాంటి వార్తలు నిరంతరం తెరపైకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ‘అజుని’ టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో చిరుతపులి అక్కడికి వచ్చింది. ఆ సమయంలో దాదాపు 300 మంది సెట్లో ఉన్నారు. సెట్లో ఉన్న కుక్కపై కూడా చిరుత దాడి చేసింది. సెట్లో ఉన్న చిరుతపులిని చూసి అక్కడున్న జనం తీవ్ర భయాందోళనకు గురై అక్కడక్కడా పరిగెడుతూ దాక్కోవడానికి ప్రయత్నించారు. జనం సందడి చేయడంతో చిరుత పారిపోయినా ప్రజల్లో భయం నెలకొంది.
Read Also:No-Confidence Motions: నెహ్రూ మొదలు మోడీ వరకు అవిశ్వాస తీర్మానాలు ఇవే..
ఇంతకు ముందు కూడా సురేష్ శ్యామ్లాల్ గుప్తా ఈ విషయాన్ని తాను చాలాసార్లు లేవనెత్తానని, కానీ ఇప్పటివరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పాడు. మహారాష్ట్ర శాసనసభలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం ఫిలిం సిటీ మొత్తం చిరుతపులి భయం నెలకొందని స్పష్టమవుతోంది. అంతకుముందు ముంబైలోని ఫిల్మ్ సిటీలో గుమ్ హై కిసీ కే ప్యార్ మే అనే టీవీ షో సెట్లోకి కొండచిలువ అకస్మాత్తుగా ప్రవేశించింది. నటుడు శక్తి అరోరా సోషల్ మీడియాలో వీడియోను పంచుకోవడం ద్వారా ఈ సమాచారాన్ని అందించారు. మూడు రోజుల క్రితం తన షో సెట్పైకి చిరుతపులి కూడా వచ్చిందని చెప్పాడు.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!