Leopard in Film City: ముంబై ఫిల్మ్ సిటీలోకి చిరుతలు.. భయంతో పరారైన మరాఠీ టీవీ సీరియల్ బృందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leopard in Film City: ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీ(Goregaon Film City)లో చిరుతపులి బీభత్సం సృష్టించింది. ప్రతీరోజూ షూటింగ్ సెట్స్లో చిరుతలు కనిపిస్తుండడంతో అక్కడి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. షో సెట్పైకి చిరుతపులి రావడంతో మరోసారి గందరగోళం నెలకొంది. నిన్న రాత్రి ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో మరోసారి చిరుతపులి కనిపించింది. ఈసారి మరాఠీ టీవీ సీరియల్ సెట్లో తన బిడ్డతో కనిపించింది. ఆ సమయంలో సెట్స్లో 200 మందికి పైగా ఉన్నారని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ శ్యామ్లాల్ గుప్తా మీడియాకు తెలిపారు. గత 10 రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం నాలుగో సారి అన్నారు.
Read Also:Kadem Project: డేంజర్ జోన్లో కడెం ప్రాజెక్టు.. పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Also Read
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
గత కొన్ని రోజులుగా ఇలాంటి వార్తలు నిరంతరం తెరపైకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ‘అజుని’ టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో చిరుతపులి అక్కడికి వచ్చింది. ఆ సమయంలో దాదాపు 300 మంది సెట్లో ఉన్నారు. సెట్లో ఉన్న కుక్కపై కూడా చిరుత దాడి చేసింది. సెట్లో ఉన్న చిరుతపులిని చూసి అక్కడున్న జనం తీవ్ర భయాందోళనకు గురై అక్కడక్కడా పరిగెడుతూ దాక్కోవడానికి ప్రయత్నించారు. జనం సందడి చేయడంతో చిరుత పారిపోయినా ప్రజల్లో భయం నెలకొంది.
Read Also:No-Confidence Motions: నెహ్రూ మొదలు మోడీ వరకు అవిశ్వాస తీర్మానాలు ఇవే..
ఇంతకు ముందు కూడా సురేష్ శ్యామ్లాల్ గుప్తా ఈ విషయాన్ని తాను చాలాసార్లు లేవనెత్తానని, కానీ ఇప్పటివరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పాడు. మహారాష్ట్ర శాసనసభలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం ఫిలిం సిటీ మొత్తం చిరుతపులి భయం నెలకొందని స్పష్టమవుతోంది. అంతకుముందు ముంబైలోని ఫిల్మ్ సిటీలో గుమ్ హై కిసీ కే ప్యార్ మే అనే టీవీ షో సెట్లోకి కొండచిలువ అకస్మాత్తుగా ప్రవేశించింది. నటుడు శక్తి అరోరా సోషల్ మీడియాలో వీడియోను పంచుకోవడం ద్వారా ఈ సమాచారాన్ని అందించారు. మూడు రోజుల క్రితం తన షో సెట్పైకి చిరుతపులి కూడా వచ్చిందని చెప్పాడు.
తాజావార్తలు
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
ట్రెండింగ్
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!