థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు హీరో అడవి శేషు.. ఇటీవల వచ్చిన మేజర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు..గతంలో 2018లో వచ్చిన గూఢచారి సినిమా భారీ హిట్ ను అందుకుంది.. దీంతో ఇప్పుడు సీక్వెల్ గూఢచారి 2 అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా వినయ్ కుమార్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు..
ఈ సినిమాకు సంబందించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులను కూడా టీమ్ మొదలు పెట్టేశారు..తాజాగా నేడు షూటింగ్ మొదలుపెట్టారు. కొన్ని రోజుల క్రితం గూఢచారి 2 ఫస్ట్ లుక్ కూడా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. నేడు ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టగా అడివి శేష్ ఫోటో ఒకటి, సెట్ నుంచి క్లాప్ బోర్డు ఫోటో ఒకటి షేర్ చేశారు చిత్రయూనిట్. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. మన ఏజెంట్ 116 మళ్ళీ వచ్చాడు. ఈ సారి త్రినేత్ర అనే కొత్త మిషన్ తో వస్తున్నాడు. ఎంతోమంది వెయిట్ చేస్తున్న స్పై సీక్వెల్ గూఢచారి 2 ఈరోజు షూటింగ్ ను మొదలు పెట్టారు..
ఈ షూటింగ్ ను నిర్వీరామంగా పూర్తి చెయ్యనున్నట్లు మేకర్స్చెబుతున్నారు.. ఇక ఈ సినిమా అభిమానులు త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. గూఢచారి 2 సినిమాపై భారీ అంచనాలు ఇప్పట్నుంచే నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారనేది ఇంకా ప్రకటించలేదు. వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు..
Lights, camera, espionage 🎥
Our Agent 116 embarks on a new mission at #Trinetra 🔥
India’s most awaited spy sequel, #G2 – shoot begins today 🎬#Goodachari2@AdiviSesh #BanitaSandhu @vinaykumar7121 @peoplemediafcy @AAArtsOfficial @AKentsOfficial @vishwaprasadtg… pic.twitter.com/rF7Y2a0si0
— People Media Factory (@peoplemediafcy) December 11, 2023