తెలుగు సినిమా ప్రపంచస్థాయికి ఎదిగింది. తెలుగు హీరోలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా అనేది కేవలం రీజియనల్ అన్నట్టుగా మాత్రమే ఉండేది.కానీ ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా తెలుగు సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అదే తరహాలో ప్రస్తుతం చాలామంది ఆడియన్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘పుష్ప 2’ కూడా ఒకటి. ఇప్పటికే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అందుకే పుష్ప సీక్వెల్ ను ఇతర దేశాల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.‘పుష్ప’మూవీకి ఇండియాలో మాత్రమే కాదు.. చైనా మరియు జపాన్ వంటి దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్లో ఇప్పుడు చాలామంది మూవీ లవర్స్ ‘పుష్ప’ మూవీతో అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ అయ్యారు. దీనితో సీక్వెల్ ని జపాన్ లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ‘పుష్ప 2’కు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నా కూడా దీనిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వడానికి మూవీ టీమ్ సిద్ధంగా లేదు.
ఇప్పటివరకు ఈ సీక్వెల్ నుండి ఒక పోస్టర్ మరియు గ్లింప్స్ మాత్రమే విడుదల అయ్యింది. అంతే కాకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకోవాలి అనుకుంటున్నా కూడా ఎన్నోసార్లు ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. కానీ ఇంతలోనే అల్లు అర్జున్ జపాన్ ఫ్యాన్స్ కి మాత్రం ఒక గుడ్ న్యూస్ వినిపించింది రష్మిక.‘పుష్ప’లో టైటిల్ పాత్రతో అల్లు అర్జున్ కి ఎంత క్రేజ్ లభించిందో.. అందులో శ్రీవల్లిగా నటించిన రష్మికకు కూడా అంతే పాపులారిటీ లభించింది. అందుకే ‘పుష్ప 2’లో అసలు తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్న రష్మిక.. తాజాగా టోక్యోలో జరిగిన క్రంచీరోల్ యానిమీ అవార్డ్స్ ఈవెంట్ కి హాజరయ్యింది. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘పుష్ప 2’పై కీలక అప్డేట్ ని అందించింది.”జపాన్ లోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పుష్ప 2 ఒరిజినల్ వర్షన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో.. అదే రోజు జపాన్ లో కూడా సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇది చాలా భారీగా ఉండబోతుంది’’ అని రష్మిక మందనా చెప్పుకొచ్చింది. దీంతో జపాన్ ఫ్యాన్స్ లో ఉత్సాహం మరింత పెరిగిపోయింది. 2024 ఆగస్ట్ 15న ఎలాగైనా ‘పుష్ప 2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు