Uttarpradesh : రూ.50కోసం కన్న కొడుకుపై దారుణంగా దాడి చేసిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో రూ.50ల కోసం ఓ తండ్రి తన సొంత కొడుకు రక్తాన్ని కళ్లజూశాడు. దారుణంగా హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కొడుకుపై పలుమార్లు గడ్డపారతో దాడి చేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత తండ్రి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ హృదయ విదారక ఘటన దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగీరథ్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మోతీరాం తన రెండో కుమారుడు కల్లు అలియాస్ రామ్ ప్రవేశ్కు కొద్ది రోజుల క్రితం సైకిల్ తాళం కోసమని రూ.50 ఇచ్చాడని గ్రామస్తులు చెబుతున్నారు. కానీ కల్లు అలియాస్ రామ్ ప్రవేశ్ సైకిల్ తాళం తీసుకుని రాలేదు. ఈ విషయమై మే 2వ తేదీ రాత్రి మోతీరామ్, కల్లు అలియాస్ రాంప్రవేష్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి మోతీరామ్ శుక్రవారం ఉదయం ఇంటి బయట మంచంపై నిద్రిస్తున్న కల్లుపై గడ్డపారతో దాడి చేశాడు. రక్తపుమడుగులో ఉన్న అతడిని ప్రజలు ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. కల్లు వయసు 27 ఏళ్లు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
Read Also:Afternoon Sleep: మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రపోతున్నారా? అయితే మీరు డేంజర్లో పడ్డట్లే..
దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు తండ్రి మోతీరామ్ను అదుపులోకి తీసుకున్నారు. పారను కూడా స్వాధీనం చేసుకున్నారు. మోతీరామ్కు 3 కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఇద్దరు కుమారులు గుజరాత్లో నివసిస్తున్నారు. రెండో కుమారుడు కల్లు అలియాస్ రామ్ ప్రవేశ్ తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. కాగా, మోతీరామ్ టీ దుకాణంలో కష్టపడి పనిచేసేవాడు.
ఈ విషయమై పోలీస్స్టేషన్ ప్రెసిడెంట్ రాజేష్ బహదూర్ సింగ్ మాట్లాడుతూ.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కుమారుడి తల, మెడ, భుజంపై తండ్రి పలుమార్లు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన కల్లు పరిస్థితి విషమంగా మారడంతో వారణాసిలోని ట్రామా సెంటర్కు తరలించారు. కల్లు స్పృహలోకి వస్తాడని ఎదురు చూస్తున్నారు. అతని వాంగ్మూలాలు తీసుకుంటారు. అదే సమయంలో పోలీసులు కుటుంబసభ్యులను కూడా విచారిస్తున్నారు.
Read Also:Ponguleti Srinivasa Reddy: కేసీఆర్ చేతిలో కర్ర పట్టుకుని నాటకాలు ఆడుతున్నారన్నారు
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!