Uttarpradesh : రూ.50కోసం కన్న కొడుకుపై దారుణంగా దాడి చేసిన తండ్రి
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో రూ.50ల కోసం ఓ తండ్రి తన సొంత కొడుకు రక్తాన్ని కళ్లజూశాడు. దారుణంగా హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కొడుకుపై పలుమార్లు గడ్డపారతో దాడి చేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత తండ్రి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ హృదయ విదారక ఘటన దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగీరథ్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మోతీరాం తన రెండో కుమారుడు కల్లు అలియాస్ రామ్ ప్రవేశ్కు కొద్ది రోజుల క్రితం సైకిల్ తాళం కోసమని రూ.50 ఇచ్చాడని గ్రామస్తులు చెబుతున్నారు. కానీ కల్లు అలియాస్ రామ్ ప్రవేశ్ సైకిల్ తాళం తీసుకుని రాలేదు. ఈ విషయమై మే 2వ తేదీ రాత్రి మోతీరామ్, కల్లు అలియాస్ రాంప్రవేష్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి మోతీరామ్ శుక్రవారం ఉదయం ఇంటి బయట మంచంపై నిద్రిస్తున్న కల్లుపై గడ్డపారతో దాడి చేశాడు. రక్తపుమడుగులో ఉన్న అతడిని ప్రజలు ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. కల్లు వయసు 27 ఏళ్లు.
Also Read
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
Read Also:Afternoon Sleep: మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రపోతున్నారా? అయితే మీరు డేంజర్లో పడ్డట్లే..
దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు తండ్రి మోతీరామ్ను అదుపులోకి తీసుకున్నారు. పారను కూడా స్వాధీనం చేసుకున్నారు. మోతీరామ్కు 3 కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఇద్దరు కుమారులు గుజరాత్లో నివసిస్తున్నారు. రెండో కుమారుడు కల్లు అలియాస్ రామ్ ప్రవేశ్ తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. కాగా, మోతీరామ్ టీ దుకాణంలో కష్టపడి పనిచేసేవాడు.
ఈ విషయమై పోలీస్స్టేషన్ ప్రెసిడెంట్ రాజేష్ బహదూర్ సింగ్ మాట్లాడుతూ.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కుమారుడి తల, మెడ, భుజంపై తండ్రి పలుమార్లు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన కల్లు పరిస్థితి విషమంగా మారడంతో వారణాసిలోని ట్రామా సెంటర్కు తరలించారు. కల్లు స్పృహలోకి వస్తాడని ఎదురు చూస్తున్నారు. అతని వాంగ్మూలాలు తీసుకుంటారు. అదే సమయంలో పోలీసులు కుటుంబసభ్యులను కూడా విచారిస్తున్నారు.
Read Also:Ponguleti Srinivasa Reddy: కేసీఆర్ చేతిలో కర్ర పట్టుకుని నాటకాలు ఆడుతున్నారన్నారు
తాజావార్తలు
-
Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
-
Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో