Gaza : గాజాలో విషాదం.. ఆహార ప్యాకెట్లు మీద పడి ఐదుగురి మృతి.. పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaza : ఇజ్రాయెల్ ఆంక్షల మధ్య గాజాకు మానవతా సహాయం అందించడంలో సమస్య ఎంత ఉందో మరోసారి బట్టబయలైంది. అనేక దేశాలు సహాయక సామగ్రిని అందించడానికి విమానాలను ఆశ్రయించవలసి వస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం విమానం పారాచూట్ సమయానికి తెరుచుకోలేకపోయింది. దీంతో రిలీఫ్ మెటీరియల్స్ ఉన్న పార్శిళ్లు పౌరుల తలలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాజా సిటీలోని షాతి శరణార్థి శిబిరం సమీపంలో ప్రజలు సహాయ ప్యాకేజీల కోసం వేచి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యను గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం ధృవీకరించింది.
Read Also:Nora Fatehi : ముంబై మెట్రోలో డ్యాన్స్ చేసిన హీరోయిన్..వీడియో వైరల్..
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం ఎయిర్డ్రాప్ నిరుపయోగంగా పేర్కొంది. ఇది మానవతా సేవగా కాకుండా లాభదాయకమైన ప్రచారంగా ఉపయోగించబడుతోంది. సరిహద్దుల ద్వారా సహాయక సామగ్రిని రవాణా చేయాలని కూడా వాదించారు. గత వారం, గాజాలో సహాయక కాన్వాయ్ సమీపంలో ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరపడంతో 100 మందికి పైగా మరణించారు. తొక్కిసలాటలో ఎక్కువ మంది మరణించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. పాలస్తీనా అధికారులు, సాక్షులు దీనిని ఖండించారు. గాజాలో కనీసం అర మిలియన్ల మంది లేదా నలుగురిలో ఒకరు కరువుకు భయపడుతున్నారని ఐక్యరాజ్యసమితి కార్యాలయం గత నెలలో నివేదించింది.
Read Also:Leopard Killed: ఎమ్మిగనూరులో చిరుత మృతి.. కారణం అదేనా..?
గాజాలోని ప్రధాన UN ఏజెన్సీ అయిన UNRWA జనవరి 23 నుండి ఇజ్రాయెల్ అధికారులు గాజా స్ట్రిప్ ఉత్తర భాగానికి సరఫరాలను తీసుకోకుండా అడ్డుకున్నారని పేర్కొంది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రపంచ ఆహార కార్యక్రమం గాజాకు డెలివరీలను నిలిపివేసింది. ఆ తర్వాత ఈజిప్ట్, అమెరికా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఎయిర్డ్రాప్ సహాయంతో ఆహారం, నీటిని పంపిణీ చేసే పనిని ప్రారంభించాయి. అయితే, ఈ పద్ధతి ఖరీదైనది. అసమర్థమైనది అని సహాయ సంస్థలు విమర్శించాయి. ఇదిలా ఉంటే సకాలంలో ఏమీ చేయకపోతే గాజా స్ట్రిప్లో కరువును ఆపడం అసాధ్యమని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఐదు నెలల పోరాటంలో 30,000 మందికి పైగా మరణించినట్లు గాజాలోని ఆరోగ్య అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!