Gayathri Gupta Controversial Comments on Baby Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బేబీ’ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో వైష్ణవి చైతన్యకు స్టార్ డమ్ వచ్చింది. బేబీ అనంతరం వైష్ణవి కెరీర్ పూర్తిగా మారిపోయింది. వరుస అవకాశాలు ఆమెను వరిస్తున్నాయి. అయితే బేబీ సినిమాలో తాను హీరోయిన్గా నటించాల్సిందని గాయత్రి గుప్తా తెలిపారు.
గాయత్రి గుప్తా వ్యాఖ్యలతో బేబీ వివాదం మరింత ముదురుతున్నట్లు కనుబడుతోంది. బేబి సినిమా కథ తనదేనని, సాయి రాజేష్ తన దగ్గరి నుంచి కాపీ కొట్టాడని ‘ప్రేమించొద్దు’ డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ ఇప్పటికే మీడియా ముందుకు వచ్చారు. సాయి రాజేష్ మోసాన్ని ‘బేబీ లీక్స్’ అనే బుక్ ద్వారా ఆయన బయటపెట్టారు. బుక్కు సంబంధించిన లింక్ను https://babyleaks2023.blogspot.com/ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో షేర్ చేశారు. ఈ రచ్చ కొనసాగుతుండగానే.. గాయత్రి గుప్తా మరో బాంబ్ పేల్చారు. బేబీ సినిమాలో ముందుగా తననే హీరోయిన్గా సెలెక్ట్ చేశారని, డైరెక్టర్ సాయి రాజేష్ తనను మోసం చేశాడని ఆధారాలతో సహా గాయత్రి బయటపెట్టారు.
‘నేను, శిరిన్ శ్రీరామ్ మంచి స్నేహితులం. 15 ఏళ్లుగా అతడు నాకు తెలుసు. నాకు విడాకులు అయ్యాక నాతో ఓ షార్ట్ ఫిల్మ్ చేశాడు. నా కెరీర్కు అది చాలా హెల్ప్ అయింది. బేబీ సినిమా స్టోరీని ‘ప్రేమించొద్దు’ అనే టైటిల్తో శిరిన్ రాసుకున్నాడు. ఈ చిత్రంలో మొదటగా హీరోయిన్గా శిరిన్ నన్ను అనుకున్నాడు. స్కూల్ డ్రెస్సులో నన్ను ఆడిషన్ కూడా చేశాడు. ఆ ఫొటోలను సాయి రాజేష్కు నేను చూపించాను. దానినే అతడు బేబీలో కాపీ కొట్టాడు. హృదయ కాలేయం ఆడియో లాంచ్కు నేను వెళితే.. సాయి రాజేష్ నన్ను చూశాడు. శిరిన్ దగ్గర నంబర్ తీసుకుని నాకు కాల్ చేశాడు. కొబ్బరిమట్ట సినిమా చేస్తున్నా.. అందులో నువ్వే హీరోయిన్ అని చెప్పాడు. అలా సాయి రాజేష్ నాకు పరిచయం’ అని గాయత్రి గుప్తా చెప్పారు.
Also Read: Virat Kohli: నిజం చెబుతున్నా.. ఆ రోజు చాలా భయపడ్డా: కోహ్లీ
‘సినిమా ఇండస్ట్రీలో నేను 20-30 సినిమాలు చేశా. కానీ కొబ్బరిమట్ట సినిమాతో చాలా కష్టాలను ఎదుర్కొన్నా. 4-5 ఏళ్లు షూటింగ్ జరిగింది. ఈ సినిమాకు సాయి రాజేష్ రూ. 3 లక్షల పారితోషికం ఇస్తానన్నాడు. కానీ కేవలం రూ. 25 వేలు ఇచ్చాడు. ఈ స్టోరీ మీద రవి కిరణ్ అని కూడా పని చేశాడు. కొత్త అమ్మాయిని పెట్టుకుంటా అని శిరిన్ అనడంతో నేను ఓకే అన్నా. బేబి కథను మొదట రాసుకుంది శిరిన్. సాయి రాజేష్ ఆ స్టోరీని తానే క్రియేట్ చేశానంటాడు. ఇద్దరు (సాయి రాజేష్, శిరిన్) కలిసి ఆ కథతో మూవీ చేద్దామని.. చివరి క్షణంలో బడ్జెట్ లేదని శిరిన్ను తప్పించాడు. 2015 నుంచి ఆ కథను శిరిన్ రాసుకున్నాడు. ఆ కథను గీతా ఆర్ట్స్తో చర్చలు జరిపాడు. పాము లాంటి సాయి రాజేష్ను వారు గుర్తించలేదు. బేబీ మూవీ కోసం సాయి రాజేష్ చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేశాడు. సాయి రాజేష్ లాంటి వ్యక్తి టాలీవుడ్కు ఓ మచ్చ. బేబి స్టోరీ రాసుకున్న శిరిన్కు న్యాయం జరగాలి’ అని గాయత్రి గుప్తా ఫైర్ అయ్యారు.