Gautam Gambhir: టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం 2026 టీ20 ప్రపంచ కప్తో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో ఐపీఎల్ 2026లో గంభీర్ కేకేఆర్ జట్టు నుంచి విడిపోతున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గంభీర్ 2026 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. త్వరలో రాజస్థాన్ రాయల్స్కు కొత్త ఓనర్స్ రాబోతున్నారని, వారు గంభీర్ను జట్టులో భాగం చేసుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారని పలు నివేదికలు సూచిస్తున్నాయి. రాజస్థాన్ ఫ్రాంచైజీ గంభీర్కు మూడు పాత్రలను ఆఫర్ చేసిందని సమాచారం.
READ ALSO: Muhammad Yunus: దిగిపోతూ, భారత్పై యూనస్ అక్కసు..‘‘7 సిస్టర్స్ కామెంట్స్’’..
పలు నివేదికల ప్రకారం.. రాజస్థాన్ రాయల్స్ కొత్త ఓనర్స్ గంభీర్కు మూడు రోల్స్ను ఆఫర్ చేసినట్లు సమాచారం. అందులో స్ట్రాటజిక్ పార్టనర్, కోచ్, సీఈఓ పదవి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూడు ఆఫర్స్కు గంభీర్ అంగీకరించలేదని సమాచారం. నిజానికి గౌతమ్ గంభీర్కు టీమిండియా ప్రధాన కోచ్గా 2027 ప్రపంచ కప్ వరకు ఒప్పందం కొనసాగుతుంది. ఆయన టీమిండియాకు హెడ్ కోచ్గా ఉన్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఆఫర్ను అంగీకరిస్తే, అది విరుద్ధ ప్రయోజనాల జాబితాలోకి వస్తుంది. సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం.. లోధా కమిటీ సిఫార్సులను అనుసరించి, ఒక వ్యక్తి భారత కోచ్గా పనిచేస్తూనే IPL ఫ్రాంచైజీకి భాగస్వామి, CEO లేదా కోచ్గా ఉండలేరు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో గౌతమ్ గంభీర్ చేరాలనుకుంటే టీమిండియా హెడ్ కోచ్ స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రచారంపై ఇప్పటి వరకు గంభీర్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వాస్తవానికి ఐపీఎల్లో మెంటర్గా గంభీర్ రికార్డు అద్భుతంగా ఉంది. ఆయన హయంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ఛాంపియన్గా తీర్చిద్దారు. అలాగే ఆయన మెంటర్షిప్లో, కొత్త ఐపీఎల్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ కూడా బాగా రాణించి ప్లేఆఫ్స్కు కూడా చేరుకుంది. ఈ రికార్డ్స్ కారణంగానే గౌతమ్ గంభీర్ను రాజస్థాన్ రాయల్స్ ఈ ఆఫర్ ఇచ్చి ఉండవచ్చని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Ameesha Patel: బాలీవుడ్ నటి అమీషా పటేల్పై నాన్-బెయిలబుల్ వారెంట్.. స్పందించిన బ్యూటీ!
