Gautam Gambhir: గంబీర్ రిపోర్ట్ కార్డ్.. టీం ఇండియా హెడ్ కోచ్ నుంచి తొలగించే అవకాశం!
- టీం ఇండియా హెడ్ కోచ్ నుంచి తొలగించే అవకాశం
- ఇంగ్లాండ్లో ఈ సిరీస్ను భారత్ ఓడిపోతే, BCCI గంభీర్ భవిష్యత్తును పునరాలోచించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుభ్మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు చారిత్రాత్మక మైదానం లార్డ్స్లో ఆతిథ్య ఇంగ్లాండ్ను సమర్ధవంతంగా ఎదుర్కొంది. కానీ ఓటమిపాలైంది. ఈ ఓటమి తర్వాత, భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలోని టెస్ట్ క్రికెట్ జట్టు ప్రదర్శన ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో మూడో టెస్ట్లో ఓటమితో, ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సిరీస్ను కోల్పోయే ప్రమాదం భారత జట్టుపై పొంచి ఉంది. గౌతమ్ గంభీర్ నాయకత్వంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత్ కొన్ని కీలక విజయాలు సాధించినప్పటికీ, టెస్ట్ ఫార్మాట్లో నిరంతర వైఫల్యాలు అతని కోచింగ్ పదవీకాలంపై ప్రశ్నార్థకంగా మారాయి. ఇంగ్లాండ్లో ఈ సిరీస్ను భారత్ ఓడిపోతే, బీసీసీఐ గంభీర్ భవిష్యత్తును పునరాలోచించే అవకాశం ఉందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
Also Read:Amit Shah: ప్రధాని మోడీ రామమందిరాన్ని నిర్మించారు, 5జీని తీసుకొచ్చారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఇప్పటివరకు, గంభీర్ సారథ్యంలో భారత్ మొత్తం 13 టెస్ట్లు ఆడింది. వాటిలో ఎనిమిది ఓడిపోయింది, నాలుగు గెలిచింది, ఒక మ్యాచ్ను మాత్రమే డ్రాగా ముగిసింది. గంభీర్ హెడ్ కోచ్ గా పగ్గాలు చేపట్టాకా టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్తో 0-3 తేడాతో ఓడిపోయింది. ఇది 12 సంవత్సరాల తర్వాత తొలి స్వదేశీ టెస్ట్ సిరీస్ ఓటమి. దీని తర్వాత, ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా భారత్ 1-3 తేడాతో ఓడిపోయింది. ఇంగ్లాండ్తో జరిగిన ప్రస్తుత సిరీస్లో, భారతదేశం లీడ్స్లో జరిగిన మొదటి టెస్ట్ను కోల్పోయింది, తరువాత ఎడ్జ్బాస్టన్లో తిరిగి పుంజుకుని సిరీస్ను 1-1తో సమం చేసింది. కానీ మళ్ళీ మూడవ మ్యాచ్లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. టీమిండియా సిరీస్ను కాపాడుకోవడానికి అగ్ని పరీక్షగా మారింది.
Also Read:Off The Record: ఆ జనసేన ఎంపీ పర్ఫార్మెన్స్లో తక్కువ..! ప్రమోషన్స్లో ఎక్కువ..?
భారత్ ఇప్పుడు మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో నాల్గవ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ జూలై 23న ప్రారంభమవుతుంది. దీని తర్వాత, సిరీస్లోని చివరి, ఐదవ మ్యాచ్ లండన్లోని ది ఓవల్ మైదానంలో జరుగుతుంది. భారత్ సిరీస్ గెలవాలంటే, ఈ రెండు మ్యాచ్లను గెలవాలి. సిరీస్ను డ్రా చేసుకోవాలంటే, భారత్ ఒక మ్యాచ్ను డ్రా చేసుకోవడంతో పాటు ఒక మ్యాచ్ను గెలవాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!