Gangster Murdered in Tihar Jail: తీహార్ జైల్లో గ్యాంగ్ వార్.. గ్యాంగ్స్టర్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangster Murdered in Tihar Jail: తీహార్ జైలులో గ్యాంగ్ వార్ జరిగింది.. ఈ ఘటనలో రోహిణి కోర్టు కాల్పుల కేసులో ప్రధాన సూత్రధారి, గ్యాంగ్స్టర్ టిల్లు తజ్పూరియా ప్రాణాలు కోల్పోయాడు.. జైల్లో జరిగిన గ్యాంగ్ వార్లో అతను మృతిచెందినట్టు తీహార్ జైలు అధికారులు ప్రకటించారు. జైలులో జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడిన అతన్ని.. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయడని పేర్కొన్నారు.. అయితే, తీహార్ జైలులో గత రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. ప్రత్యర్థి గ్యాంగ్ చేతిలో తజ్పూరియా తీవ్రంగా గాయపడ్డాడు.. అతడిపై యోగేష్ తుండా, అతని అనుచరులు ఇనుప రాడ్లతో దాడికి తెగబడినట్లు సమాచారం.. అయితే, తీవ్రంగా గాయపడిన టిల్లు తజ్పూరియాను ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
సునీల్ మాన్, అతని అలియాస్ టిల్లు తాజ్పురియా, ఢిల్లీలోని రోహిణి కోర్టులో జరిగిన కాల్పుల్లో ప్రధాన నిందితుడిగా జైలు పాలైన గ్యాంగ్స్టర్. అతను చాలా సంవత్సరాలు జైలులో ఉన్నాడు మరియు అతనిపై హత్య ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలోని పేరుపొందిన గ్యాంగ్స్టర్లలో ఒకరైన టిల్లూ తాజ్పురియా.. ఢిల్లీలో మోస్ట్ వాండెటెడ్ అయిన గ్యాంగ్స్టర్ జితేందర్ గోగిని కిందటి ఏడాది సెప్టెంబర్లో రోహిణి కోర్టు ప్రాంగణంలోనే కాల్చి చంపిన కేసులో ప్రధాన సూత్రధారి.. అప్పుడు మండోలా జైలు నుంచే అతను జితేందర్ హత్యకు ప్రణాళిక వేయడం గమనార్హం. అయితే.. జితేందర్ను కాల్చిచంపిన ఇద్దరు దుండగులు అప్పుడే పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. వీరిని ఉమాంగ్ యాదవ్, వినయ్గా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా టిల్లుకు వీరిద్దరూ సమాచారం ఇచ్చినట్టు విచారణలో తేలింది..
టిల్లు గ్యాంగ్కు చెందిన ఇద్దరు వ్యక్తులు న్యాయవాదుల వేషధారణలతో రోహిణి కోర్టులో విచారణకు వచ్చినప్పుడు గోగిని హత్య చేశారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, టిల్లూ తాజ్పురియా.. ఇద్దరు షూటర్లతో జైలు లోపల నుండి వాట్సాప్ ద్వారా నిరంతరం టచ్లో ఉన్నారని మరియు రోహిణి కోర్టు లోపల షూటౌట్కు ఆయుధాలు పొందడంలో వారికి సహాయం చేశాడని తెలిపారు. గోగి టిల్లు యొక్క ప్రత్యర్థి ముఠా సభ్యుడు. అయితే, ఇప్పుడు తీహార్ జైలులో జరిగిన ఘర్షణలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజావార్తలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
-
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!