Gangster Murdered in Tihar Jail: తీహార్ జైల్లో గ్యాంగ్ వార్.. గ్యాంగ్స్టర్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangster Murdered in Tihar Jail: తీహార్ జైలులో గ్యాంగ్ వార్ జరిగింది.. ఈ ఘటనలో రోహిణి కోర్టు కాల్పుల కేసులో ప్రధాన సూత్రధారి, గ్యాంగ్స్టర్ టిల్లు తజ్పూరియా ప్రాణాలు కోల్పోయాడు.. జైల్లో జరిగిన గ్యాంగ్ వార్లో అతను మృతిచెందినట్టు తీహార్ జైలు అధికారులు ప్రకటించారు. జైలులో జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడిన అతన్ని.. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయడని పేర్కొన్నారు.. అయితే, తీహార్ జైలులో గత రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. ప్రత్యర్థి గ్యాంగ్ చేతిలో తజ్పూరియా తీవ్రంగా గాయపడ్డాడు.. అతడిపై యోగేష్ తుండా, అతని అనుచరులు ఇనుప రాడ్లతో దాడికి తెగబడినట్లు సమాచారం.. అయితే, తీవ్రంగా గాయపడిన టిల్లు తజ్పూరియాను ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- Vaibhav Sooryavanshi: "ఫుడ్ విషయంలో తగ్గేదేలే".. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
- Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే 'హర్రర్ సినిమాలు' చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
- 1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
సునీల్ మాన్, అతని అలియాస్ టిల్లు తాజ్పురియా, ఢిల్లీలోని రోహిణి కోర్టులో జరిగిన కాల్పుల్లో ప్రధాన నిందితుడిగా జైలు పాలైన గ్యాంగ్స్టర్. అతను చాలా సంవత్సరాలు జైలులో ఉన్నాడు మరియు అతనిపై హత్య ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలోని పేరుపొందిన గ్యాంగ్స్టర్లలో ఒకరైన టిల్లూ తాజ్పురియా.. ఢిల్లీలో మోస్ట్ వాండెటెడ్ అయిన గ్యాంగ్స్టర్ జితేందర్ గోగిని కిందటి ఏడాది సెప్టెంబర్లో రోహిణి కోర్టు ప్రాంగణంలోనే కాల్చి చంపిన కేసులో ప్రధాన సూత్రధారి.. అప్పుడు మండోలా జైలు నుంచే అతను జితేందర్ హత్యకు ప్రణాళిక వేయడం గమనార్హం. అయితే.. జితేందర్ను కాల్చిచంపిన ఇద్దరు దుండగులు అప్పుడే పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. వీరిని ఉమాంగ్ యాదవ్, వినయ్గా పోలీసులు గుర్తించారు. దీనికి ముందు ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా టిల్లుకు వీరిద్దరూ సమాచారం ఇచ్చినట్టు విచారణలో తేలింది..
టిల్లు గ్యాంగ్కు చెందిన ఇద్దరు వ్యక్తులు న్యాయవాదుల వేషధారణలతో రోహిణి కోర్టులో విచారణకు వచ్చినప్పుడు గోగిని హత్య చేశారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, టిల్లూ తాజ్పురియా.. ఇద్దరు షూటర్లతో జైలు లోపల నుండి వాట్సాప్ ద్వారా నిరంతరం టచ్లో ఉన్నారని మరియు రోహిణి కోర్టు లోపల షూటౌట్కు ఆయుధాలు పొందడంలో వారికి సహాయం చేశాడని తెలిపారు. గోగి టిల్లు యొక్క ప్రత్యర్థి ముఠా సభ్యుడు. అయితే, ఇప్పుడు తీహార్ జైలులో జరిగిన ఘర్షణలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజావార్తలు
-
Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
-
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్ఫ్లేట్ అవుతున్నాయి’!
-
Best AI Laptops 2026: AI ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్టాప్లు బెస్ట్ ఆప్షన్స్!
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!