G20 Summit Live Updates: భారత్ అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన భారత్ మండపంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి పలు దేశాల అధినేతలతో పాటు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.