Cyber Fraud: నాలుగు విధాలుగా ప్రజలను ట్రాప్ చేస్తున్న కేటుగాళ్లు.. మీ డబ్బు జర జాగ్రత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: సైబర్ కేటుగాళ్లు ప్రజలను తమ ఉచ్చులో పడేయడానికి అనేక కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. రోజుకో కొత్త వ్యూహాలు, ట్రిక్కులతో ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. జాబ్ ఆఫర్లు, ఆకర్షణీయమైన ఆఫర్లు అంటూ జనాలకు సైబర్ నేరస్థులు వల వేస్తున్నారు. ఆపై ఆన్లైన్ చెల్లింపులు చేయమని అడుగుతారు. మీరు సమాచారం ఇచ్చిన వెంటనే మీ ఖాతా నుండి డబ్బు దొంగిలించేస్తు్న్నారు. ఇలాంటి మోసాలకు దూరంగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాటికి గురికాకుండా ఉండాలంటే కొన్ని మార్గాలున్నాయి. అసలు మోసాలు ఎలా చేస్తారో.. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం.
UPI రీఫండ్ స్కామ్
ప్రస్తుతం ఏ చిన్న ట్రాన్సక్షన్ కు అయినా యూపీఐని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కిరాణా దుకాణాల నుంచి మాల్స్ వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు జోరందుకున్నాయి. సైబర్ నేరగాళ్లు అలాంటి వారిని టార్గెట్ చేస్తూ యాప్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుంటారు. సైబర్ నేరగాళ్లు UPI రీఫండ్ ను ఆకర్షిస్తూ మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ సందర్భంలో మీరు రీఫండ్ సమయంలో దాన్ని ధృవీకరించాలి. ఏదైనా చెల్లింపు ధృవీకరణ తర్వాత మాత్రమే చేయాలి.
Also Read
- Vladimir Putin: "రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు".. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
- Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
- Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
- Astrology: సెప్టెంబర్ 12 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్న్యూస్..!
Read Also:Jeff Bezos Buys Estate: రూ. 560 కోట్లతో లగ్జరీ ఎస్టేట్ కొన్న బెజోస్.. ఎవరి కోసమో తెలుసా?
OTP స్కామ్
చాలా వరకు మోసాలు OTP ద్వారానే జరుగుతున్నాయి. నకిలీ సందేశం కింద, నేరస్థులు మీ నుండి మోసం OTP లేదా PIN వివరాలను పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ వివరాలతో వారు మీ ఖాతా నుండి డబ్బును తీసివేస్తారు. అలాంటి మోసాలను నివారించడానికి మీరు OTP, PINని సురక్షితంగా ఉంచుకోవాలి. ఈ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.
నకిలీ డెలివరీ స్కామ్
సైబర్ నేరగాళ్లు ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ కి సంబంధించిన నకిలీ వెబ్సైట్ ద్వారా బంపర్ ఆఫర్లను ప్రకటిస్తారు. OTP మొదలైన వాటి ద్వారా ఈ ఆఫర్పై వ్యక్తుల నుండి సమాచారాన్ని సేకరిస్తారు. ఈ సమాచారం సహాయంతో ఖాతాలోకి చొరబడి మోసాలకు పాల్పడుతారు. మీరు ఇలాంటి మోసాన్ని నివారించాలనుకుంటే రిజిస్టర్డ్ స్థలాల నుండి మాత్రమే లావాదేవీలు చేయాలి. క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకోవడం అత్యుత్తమం.
Read Also:UPI in Other Countries: దేశీయ డిజిటల్ చెల్లింపు వ్యవస్థపై ప్రశంసలు… యూపీఐపై ఆసక్తి చూపుతున్న జపాన్
నకిలీ బిల్లుల ద్వారా మోసం
మీరు మీ కరెంటు బిల్లును ఆన్లైన్లో చెల్లించడం ద్వారా కేటుగాళ్లు కొత్త మోసాలకు తెరతీస్తున్నారు. చాలా మంది వినియోగదారులు వాట్సాప్లో రాంగ్ నంబర్ల నుండి సందేశాలు అందుకుంటున్నారని, వారు వెంటనే నిర్దిష్ట నంబర్కు కాల్ చేయకపోతే వారి విద్యుత్ కనెక్షన్ త్వరలో నిలిపివేయబడుతుందని పేర్కొంటున్నారు. ఈ మెసేజ్ వాస్తవికతను తనిఖీ చేయకుండా ఎప్పుడూ సమాచారం ఇవ్వకూడదు. మొదట దాన్ని తనిఖీ చేసిన తర్వాతే రిప్లై ఇవ్వాలి.. లేదంటే మీ ఖాతా ఖాళీ కావడం గ్యారెంటీ.
తాజావార్తలు
-
Nivin Pauly : మలయాళం ఆల్టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’
-
Vladimir Putin: “రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు”.. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
-
Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్లైన్కు నష్టం!
-
Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
-
418 Trailer: ఆ గదిలో అసలేం ఉంది? భయపెట్టేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’ ట్రైలర్
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?