Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Forty Years For Megha Sandesham Movie

Meghasandesam Movie 40 Years:నలభై ఏళ్ళ ‘మేఘసందేశం’

Published Date :September 24, 2022 , 6:10 am
By Subbarao N
Meghasandesam Movie 40 Years:నలభై ఏళ్ళ ‘మేఘసందేశం’
  • Follow Us :
  • google news
  • dailyhunt

forty years for megha sandesham movie

నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమాని దర్శకరత్న దాసరి నారాయణరావు. వీరి కాంబినేషన్ లో రూపొందిన చిత్రాలలో “ఏడంతస్తుల మేడ, శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం, బహుదూరపు బాటసారి, బంగారు కుటుంబం” వంటి చిత్రాలు విజయం సాధించాయి. అన్నిటినీ మించి ‘ప్రేమాభిషేకం’ చరిత్ర సృష్టించే ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత నుంచీ ఏయన్నార్, దాసరి కాంబోలో వచ్చిన చిత్రాలపై ప్రేక్షకుల్లో భలే ఆసక్తి ఉండేది. అక్కినేని 200వ చిత్రంగా ‘మేఘసందేశం’ చిత్రాన్ని దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించడం విశేషం! ఈ సినిమా 1982 సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాసరి పద్మ సమర్పణలో తారకప్రభు ఫిలిమ్స్ పతాకంపై ‘మేఘసందేశం’ రూపొందింది.

Also Read

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
  • CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
  • Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..
  • Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..

‘మేఘసందేశం’ కథ ఏమిటంటే – ప్రకృతిని చూస్తే పరవశించిపోయే కవి రవీంద్రబాబు. ఆయనకు కళలంటే ఎంతో అభిమానం. పార్వతి ఆయన భార్య. వారికి ఓ కూతురు ఉంటుంది. తన ఊరిలో రవీంద్రబాబు నిజాయితీ పరునిగా, మంచివాడిగా పేరు సంపాదించి ఉంటాడు. ఆయన మాటకు ఊరి జనం కూడా విలువనిస్తూ ఉంటారు. ఆ ఊరిలో ఏటి ఒడ్డున ఓ కళావంతుల కుటుంబం వచ్చి ఉంటుంది. అందులో పద్మ, ఆమె సోదరి కలసి తమ నృత్యంతో ఊరి జనాన్ని ఆకర్షిస్తూ ఉంటారు. అక్కడకు వెళ్తూ తమ మొగుళ్ళు కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని ఎంతోమంది ఆడవాళ్ళు వాపోతుంటారు. ఇది తెలిసిన రవీంద్రబాబు ఆ ఒడ్డుకు వెళ్ళి ఆ కళావంతుల ఆట చూసేవారిని మందలిస్తాడు. ఓ సారి ఆ కళాకారుల నృత్యగీతాలు విని రవీంద్రబాబు కూడా పరవశించి పోతాడు. ఊరందరికీ బుద్ధి చెప్పిన రవీంద్రబాబు, పద్మ నాట్యానికి ఆకర్షితుడవుతాడు. తన కవితకు తగ్గ నాట్యం చేసే పద్మతోనే జీవితంగా మారిపోతాడు. ఈ విషయం పార్వతికి తెలుస్తుంది. తన అన్నయ్య జగన్నాథానికి చెబుతుంది. అది తెలిసి జగన్నాథం, పద్మను హెచ్చరిస్తాడు. అది రవీంద్రబాబుకు తెలుస్తుంది. బాధపడతాడు. తరువాత పద్మ కనిపించక ఆమె కోసం మేఘాలతో సందేశం పంపుతూ కవితలు రాస్తూ తిరుగుతాడు. పద్మ ఊరొదిలి వేరే ఊరికి మకాం మారుస్తుంది. ఆమెను వెదుకుతూ వెళ్ళిన రవీంద్రబాబు, ఆమెతోనే వెళ్ళాడని ఊరిజనం అనుకుంటూ ఉంటారు. పద్మ నాట్య ప్రదర్శన వద్ద రవీంద్ర ఆమెను కలుసుకుంటాడు. రవీంద్ర కూతురు పెళ్ళికి రమ్మని జగన్నాథం, ఆ ఊరి పెద్దలు పిలవడానికి వస్తారు. రాలేనంటాడు. వస్తే తన కూతురికే పరువు తక్కువ అనీ చెబుతాడు. కానీ, పద్మనే నచ్చచెప్పి పంపిస్తుంది. పెళ్ళయ్యాక కూతురు వెళ్ళవద్దని రవీంద్రను కోరుతుంది. తాను చేసిన పాపానికి, భార్యను క్షమాపణ కోరతాడు రవీంద్ర. ఆయన మనసు పద్మ దగ్గరే ఉంది అక్కడికి తీసుకువెళ్తేనే మంచిదని పార్వతి అంటుంది. కానీ, ఆలోగా ఆయన ప్రాణం విడుస్తాడు. పద్మకు ఈ విషయం చెప్పాలా, ఆమెను తీసుకు రావాలా వద్దా అనే అంశంపై చర్చ సాగుతుంది. పార్వతి తన అన్నను పిలిచి, పద్మను తీసుకు రమ్మంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే పద్మ చనిపోయి ఉంటుంది. రవీంద్ర, పద్మ ఇద్దరికీ ఒకే చోట అంత్యక్రియలు జరగడంతో కథ ముగుస్తుంది.

ఏయన్నార్, జయసుధ, జయప్రద, జగ్గయ్య, సుభాషిణి, శ్రీగంగ, బేబీ అనిత, వై.ఎస్.లక్ష్మి, రాజ్యలక్ష్మి, రాంబాబు, రాజబాబు, అట్లూరి బలరామ్, బౌనా ముఖ్యపాత్రధారులు కాగా, “పాడనా వాణి కళ్యాణిగా…” అంటూ సాగే పాటలో ప్రఖ్యాత గాయకులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాట పాడుతూ కనిపించారు. రమేశ్ నాయుడు స్వరకల్పన చేసిన ఈ చిత్రంలో అనువైన చోట జయదేవుని అష్టపదులు ఉపయోగించుకోగా, దేవులపల్లి, వేటూరి పాటలు రాశారు. పాలగుమ్మి పద్మరాజు పద్యాలను వినియోగించుకున్నారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం దాసరి నారాయణరావు నిర్వహించారు. “ఆకాశ దేశానా… ఆషాఢమాసాన…”, “నవరస సుమమాలిక…”, “నిన్నటిదాకా శిలనైనా…”, “పాడనా వాణి కళ్యాణిగా…” అంటూ సాగే పాటలను వేటూరి కలం పలికించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన “ఆకులో ఆకునై…”, “ముందు తెలిసెనా ప్రభూ…”, “సిగలో అవి విరులో…”, “సీతవేళ రానీయకు…” అనే పాటలూ చోటు చేసుకున్నాయి. జయదేవుని “ప్రియే చారుశీలే…” అనే అష్టపది సైతం అలరించింది.

ఈ చిత్ర కథ వి.శాంతారామ్ తెరకెక్కించిన ‘పింజ్రా’ను పోలి ఉంటుంది. దానికే కొన్ని మార్పులూ చేర్పులూ చేసి ‘మేఘసందేశం’ రూపొందించారు. ‘మేఘసందేశం’ పాటలతో పరవశింప చేసింది. కానీ, ఆర్థిక విజయం సాధించలేకపోయింది. ఈ చిత్రానికి పలు జాతీయ, రాష్ట్ర బహుమతులు లభించాయి.
ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడుగా రమేశ్ నాయుడు, ఉత్తమగాయకునిగా ఏసుదాస్, ఉత్తమగాయనిగా పి.సుశీల నేషనల్ అవార్డులు సొంతం చేసుకున్నారు.
అంతకు ముందు ‘నంది’ అవార్డుల్లో ఉత్తమ నటుడు కేటగిరీ అనే విభాగాన్ని 1977లో ప్రారంభించారు. ‘అమరదీపం’ చిత్రం ద్వారా కృష్ణంరాజు నంది అందుకున్న తొలి ఉత్తమనటుడుగా నిలిచారు. అయితే అవార్డులు కూడా హీరోలకేనా అనే విమర్శలు వినిపించాయి. దాంతో తరువాత కేరెక్టర్ యాక్టర్స్ కు ఉత్తమ నటులుగా నంది అవార్డులు ఇస్తూ వచ్చారు. ఈ సినిమా 1982లో విడుదల కాగా, 1983లో యన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఆయన హయాములోనే నంది అవార్డులు ప్రదానం చేశారు. హీరోలు కూడా నటులే కదా అన్న భావనతో ఈ సినిమాతో ఏయన్నార్ కు ఉత్తమ నటునిగా నంది అవార్డును ఇచ్చారు. అప్పటి నుంచే హీరోలకు కూడా నంది అవార్డుల్లో ఉత్తమ నటులుగా బహుమతులు రాసాగాయి.

నంది అవార్డుల్లో మేఘసందేశం చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు రాగా, ఉత్తమ నటుడుగా ఏయన్నార్, ఉత్తమ నటిగా జయసుధ, ఉత్తమ సంగీత దర్శకుడుగా రమేశ్ నాయుడు, ఉత్తమ గీత రచయితగా దేవులపల్లి, ఉత్తమ నేపథ్యగాయకుడుగా ఏసుదాస్, ఉత్తమ గాయనిగా పి.సుశీల, ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా ఎ.ఆర్.స్వామినాథన్, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా సెల్వరాజ్ అవార్డులు అందుకున్నారు. ఇలా అవార్డులనైతే బాగానే సంపాదించిన ‘మేఘసందేశం’ ప్రేక్షకుల రివార్డును అందుకోలేక పోయింది.

 

 

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akkineni Nageshwar Rao
  • ANR
  • jayaprada
  • Jayasudha
  • Meagha Sandesham Movie

తాజావార్తలు

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Producing States in India: భారత్‌లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?

  • CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?

  • Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..

  • Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions