NTV Telugu Site icon

KTR: కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు

Ktr Konda Surekha

Ktr Konda Surekha

కేటీఆర్ మంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఫోన్ టాపింగ్ చేశారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలతో పాటు, ఓ సినీ జంట విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ.. కొన్ని దుర్వేశపూర్వక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. కేవలం తన గౌరవానికి ఈ ఇమేజ్కి భంగం కలిగించాలన్న లక్ష్యంగానే సినీ యాక్టర్ల పేర్లను తీసుకుంటూ కొండ సురేఖ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు.

READ MORE: Israel: ఇజ్రాయెల్‌కు భారీ ఎదురుదెబ్బ.. లెబనాన్‌లో 8 మంది సైనికుల మృతి

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్.. కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకుంటున్నారన్నారని ఆరోపించారు. ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరమని మంత్రి తెలిపారు. అసలు తనకు సంబంధమే లేని ఫోన్ టాపింగ్, ఇతర అంశాల పైన కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారన్నారని.. ఎలాంటి సాక్షాలు లేకుండా అసత్య పూరిత వ్యాఖ్యలు, దురుద్దేశ పూరిత మాటలు, మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచురితం అయ్యాయన్నారు.

READ MORE:Japan: ఎయిర్‌పోర్టులో పేలిన యూఎస్ బాంబు.. 87 విమానాలు రద్దు

ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడే అవకాశం ఉందని కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులు పేర్కొన్నారు. ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని సోయి కూడా లేకుండా కొండా సురేఖ మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసింది అన్నారు. గతంలో ఇవే అడ్డగోలు మాటలు మాట్లాడిన కొండా సురేఖకు ఈ సంవత్సరం నాలుగవ నెలలో నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన ఆమెకు భారత ఎన్నికల సంఘం గట్టి హెచ్చరిక చేసిందని లేఖలో తెలిపారు. ప్రణాళికబద్ధంగా కావాలనే పదేపదే అవే అబద్దాలను తన వ్యక్తిత్వాన్ని తగ్గించడం కోసం, నష్టపరచడం కోసం చేస్తుందన్నారు. వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తన లీగల్ నోటీసుల్లో డిమాండ్ చేశారు. దీంతోపాటు అబద్దాలు, అసత్యాలు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసులను కూడా వేస్తానని హెచ్చరించారు.